|
స్వరాష్ట్రంబునకు నీతిబాధలు లేకుండునట్లుగా భూపరి
పాలనంబుఁ గావింపుచు నిజభార్య యైనకీర్తిమాలినితోడ
సకలసామ్రాజ్యభోగంబు లనుభవింపుచుఁ బరమానందంబున
నుండునంత.
| 256
|
వసంతఋతువర్ణనము
క. |
విధుమదనసఖ్యకర మై
మధుకరశుకపికమయూరమధుకరరసవా
గ్బధిరీకృతదిక్తట మై
మధుమాసము దోఁచె ధరణిమండల మలరన్.
| 257
|
మ. |
చిగిరించె న్సకలద్రుమంబులును బూచె న్మల్లికావ్రాతముల్
సెగలై తోఁచెను మాలతీతతికి రాజీవాకరోద్యానము
ల్మిగులన్ హర్షము దోఁపఁ బుష్పరసము ల్మెండయ్యె నిర్మేఘమై
గగనంబెంతయు నొప్పె మాధవుఁ డభంగఖ్యాతిఁ దోతెంచినన్.
| 258
|
భద్రాయువు భార్యతోఁగూడి వనవిహారంబు సల్పుట
సీ. |
అంత నాభద్రాయు వతిమనోహర మైన
యామధుమాసంబునందు వేడ్కఁ
బల్లవమంజరీప్రసనాదిహృద్యంబు
కుంజగుంజద్భృంగరంజితంబు
కుందవాసంతికాకుసుమసౌగంధ్యంబు
కోరకితాశోకకురవకంబు
నవఫలభారావనమ్రరసాలంబు
మాధవీమల్లికామంటపంబు
|
|
తే. |
కీరశారీమయూరకోకిలమరాళ
ముఖరకలకలరావసముజ్జ్వలంబు
|
|