పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/263

ఈ పుట ఆమోదించబడ్డది

256

బ్రహ్మోత్తరఖండము


స్వరాష్ట్రంబునకు నీతిబాధలు లేకుండునట్లుగా భూపరి
పాలనంబుఁ గావింపుచు నిజభార్య యైనకీర్తిమాలినితోడ
సకలసామ్రాజ్యభోగంబు లనుభవింపుచుఁ బరమానందంబున
నుండునంత.

256

వసంతఋతువర్ణనము

క.

విధుమదనసఖ్యకర మై
మధుకరశుకపికమయూరమధుకరరసవా
గ్బధిరీకృతదిక్తట మై
మధుమాసము దోఁచె ధరణిమండల మలరన్.

257


మ.

చిగిరించె న్సకలద్రుమంబులును బూచె న్మల్లికావ్రాతముల్
సెగలై తోఁచెను మాలతీతతికి రాజీవాకరోద్యానము
ల్మిగులన్‌ హర్షము దోఁపఁ బుష్పరసము ల్మెండయ్యె నిర్మేఘమై
గగనంబెంతయు నొప్పె మాధవుఁ డభంగఖ్యాతిఁ దోతెంచినన్.

258

భద్రాయువు భార్యతోఁగూడి వనవిహారంబు సల్పుట

సీ.

అంత నాభద్రాయు వతిమనోహర మైన
        యామధుమాసంబునందు వేడ్కఁ
బల్లవమంజరీప్రసనాదిహృద్యంబు
        కుంజగుంజద్భృంగరంజితంబు
కుందవాసంతికాకుసుమసౌగంధ్యంబు
        కోరకితాశోకకురవకంబు
నవఫలభారావనమ్రరసాలంబు
        మాధవీమల్లికామంటపంబు


తే.

కీరశారీమయూరకోకిలమరాళ
ముఖరకలకలరావసముజ్జ్వలంబు