పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/262

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

255


నిర్మాణమోహుండు నిర్దుష్టచరితుండు
       షడ్వర్గరహితుండు సర్వసముఁడు
విజితేంద్రియుండును విగతదోషుండును
       శమదమాదికగుణోజ్జ్వలుఁడు నగుచు


తే.

నంతఁ బత్నీసమేతుఁడై యవ్విభుండు
పావనము లైనపుణ్యతపోవనముల
ఘోరతప మాచరించి యోగులు నుతింప
ముక్తిదం బైనశివలోకమున వసించె.

252


ఉ.

న్యాయము దప్పకుండ రఘునందనరంతిదిలీపకార్తవీ
ర్యాయతవిక్రమంబున నరాతుల గెల్చి సమస్తధర్మముల్
చేయుచుఁ జంద్రశేఖరవశీకరణాచ్ఛమనోబ్జ మొప్ప భద్రా
యువు రాజ్య మేలెఁ బ్రమదంబుగ భూమిజను ల్నుతింపఁగన్.

253


క.

ద్విజబాహుజవిట్ఛూద్రులు
నిజవర్ణాచారధర్మనిష్ఠాపరు లై
వృజినరహితు లై యుండఁగఁ
బ్రజలను బాలించె నపుడు భద్రాయు వొగిన్.

254


మ.

పరరాష్ట్రంబుల ధారుణీపతులు కప్పంబుల్ సమర్పించి బం
ధురమైత్రిం దను గొల్వఁగా సుజనసందోహంబు వర్ధిల్లఁగా
నురగేంద్రద్విపకూర్మశైలములభారోద్రేకము ల్వీడఁగా
ధరణీపాలన మాచరించె నతఁ డుద్యత్కీర్తిధౌరేయుఁడై.

255


వ.

మఱియు నారాజపుంగవుండు శరణాగతులకు నభయంబు
లొసంగుచు వాపీకూపతటాకారామనిర్మాణవివాహోపన
యనదేవతాగృహప్రతిష్ఠాగ్రహారాదిసమస్తధర్మంబు
లాచరింపుచు నశ్వమేధాదిమహాధ్వరంబు లొనరింపుచు