పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/261

ఈ పుట ఆమోదించబడ్డది

254

బ్రహ్మోత్తరఖండము


హిణీబలపలాయనకరణదండప్రచండప్రతాపా మగధ
రాజగర్వనిర్వాపణా భూలోకపురందరా కందర్పసుందరా
ధైర్యవిజితమేరుమందరా జయవిజయీభవ యని ప్రశం
సింపుచుఁ గైవారమ్ములు సేయ వాహ్యాళి వెడలి పరమోత్స
వంబునఁ బురవీథులం బ్రదక్షిణముగా విచ్చేయుచుఁ బ్రతి
గృహాంగణప్రదేశనివాళితనీరాజనంబులు గైకొనుచు
సకలజనమనోరంజనముగాఁ గ్రమ్మఱ సభాస్థానమునకుం
జనుదెంచి రత్నసింహాసనాసీనుండై బ్రాహ్మణాశీర్వాదం
బులు గైకొని వారలకు ననేకగోభూహిరణ్యాదిదానంబు
లాచరించి సకలబంధుసమేతంబుగా మృష్టాన్నపానములు
భుజియించి కతిపయదినములకు దేశాంతరసమాగతు లయిన
రాజులమణిభూషణాంబరవాజివారణాదిబహుమానంబుల
సంతుష్టులం గావించి క్రమ్మఱ యథాస్థానమ్ములకుం బోవం
బనిచి తదనంతరమునఁ గొన్నిదినములకుఁ జంద్రాంగదపద్మా
కరులం బ్రియపూర్వకముగా వందనాలింగనాదిసత్కార
ములఁ బూజించి వారివారిపురములకుం బోవునట్లుగాననుజ్ఞ
యొసంగి యంత దేవీసహితముగాఁ బరమానందంబున
రాజ్యపరిపాలనంబుఁ జేయుచున్న నిజకుమారుం డయిన
భద్రాయువుం గాంచి వజ్రబాహుండు పరమాహ్లాదంబున
సుఖంబున నుండెనని చెప్పి సూతుం డి ట్లనియె.

251


సీ.

అంతట మఱికొన్నిహాయనంబులకును
         వార్ధక్యదశఁ జెంది వజ్రబాహుఁ
డాత్మవిజ్ఞానియై హరుపదాబ్జంబులు
         మదిలోన నిల్పి నిర్మలమనీష