పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/258

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

251


ద్వన్నుతకీర్తి పంపె నటు వైశ్యపతిన్‌ బహుమాన మొప్పఁగన్

246


వ.

అంత నావైశ్యనాథుం డైనపద్మాకరుండు భద్రాయువుచేతం
గృహీతసత్కారుండై నిజకుటుంబసమేతముగాఁ దదీయ
జననీజనకులచేత ననుజ్ఞాతుండై భద్రాయువుం బ్రశంసిం
పుచు ఋషభయోగీంద్రుమహామహిమంబు లెన్నుచుఁ గతి
పయప్రయాణముల పురంబు బ్రవేశించి యాత్మమందిర
మున సుఖం బుండె నంత.

247


చ.

జనకునియాజ్ఞఁ దప్పక యజస్రము సద్గురుసేవ సేయుచున్
ఘనతరధైర్యశౌర్యములు గల్గి సమస్తవిపక్షమండలిం
దునుముచు ధర్మమార్గమున దోర్బలవిక్రమశాలి రాజనం
దనుఁడు నిజాప్తమంత్రిసహితంబుగ నుండెను నిర్విచారుఁడై.

248


క.

పదియాఱువత్సరములకుఁ
బదపడి నిజపురము జేరి భద్రాయువు దాఁ
బదిరెండుహాయనంబులు
సదమలమతి నుండెఁ దనదుజనకునిపజ్జన్.

249

భద్రాయువునకుఁ బట్టముగట్టుట

ఉ.

శ్రీయుతదివ్యలక్షణుఁడు శిష్టజనావనశీలుఁ డంబికా
నాయకపాదపద్మభజనారతుఁ డుజ్జ్వలతేజుఁ డైనభ
ద్రాయువుఁ గాంచి భూభరధురంధరుఁ జేయఁగ నిశ్చయించె న
త్యాయతకీర్తిశాలి యగుతజ్జనకుండు మహాముదంబునన్.

250


వ.

ఇవ్విధంబున నవ్వజ్రబాహుండు నిజనందనుం డైనభద్రా
యువునకు దాశార్ణమహీమండలసామ్రాజ్యధురంధరత్వంబు
నకు నభిషేకంబు సేయం దలంచి పురం బతిమనోహరంబుగా
నలంకారంబు గావింపఁ దగువారల నియోగించి కోసల