పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/257

ఈ పుట ఆమోదించబడ్డది

250

బ్రహ్మోత్తరఖండము


బునఁ బరిషన్మధ్యంబునకు వచ్చి యచ్చట సమస్తప్రధాన
మిత్రబాంధవవిద్వజ్జనపరివేష్టితుం డయి యున్నతమతండ్రి
సన్నిధానంబునఁ దేజంబు మెఱయ నర్హాసనంబునఁ గూర్చుండి
తత్సమయోచితంబు లగురాజకార్యంబులు నిర్వర్తింపుచు
సకలప్రకృతిజనంబులకు సంతోషం బొనరింపుచు బాంధవ
జనంబులతో మైత్రి నెఱపుచు దీనానాథజనంబులకు వలసిన
యర్థంబు లొసంగుచు నతిథిసత్కారంబు లాచరింపుచు
యథేష్టభోగంబు లనుభవింపుచు నిజకళత్రసమేతంబుగాఁ
బరమానందంబుల సుఖం బుండె నంత.

242


శా.

ఆలో నొక్కదినంబునందు మగధక్ష్మాధీశుకారాగృహ
వ్యాలీఢత్వము మాన్పి తెచ్చి మధురవ్యాహారపూర్వంబుగా
నీలగ్రీవపదాబ్జసాక్షికముగా నిర్భీతుఁ గావించి భూ
షాలంకారము లిచ్చి పంపె నతిసౌహార్దంబు సంధిల్లఁగన్.

243


తే.

ఇవ్విధంబున యువరాజ్య మేలుచుండి
యొక్కదినమునఁ గారుణ్య ముప్పతిల్ల
వైశ్యనాథుని బిలిపించి వరవిభూష
ణాంబరంబు లొసంగి భద్రాయు వపుడు.

244


క.

పద్మాకరు బహుమణిధన
పద్మాకరు మేరుధీరు బాంధవపటలీ
పద్మాకరహంసోదయుఁ
బద్మాకరభవను గాంచి పలికెను మైత్రిన్.

245


ఉ.

పన్నగరాజహారునికృపాతిశయంబునఁ జేసి మమ్ము నా
పన్నుల నుద్ధరించితివి ప్రత్యుపకారము సేయనోప నా
మన్నన యాదరించి నిజమందిరసీమకుఁ బొమ్మటంచు వి