పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/256

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

249


వరుణుండు నిర్మలస్వాంతుని గావించుఁ
         బవనుండు నీకు దోర్బల మొసంగు
ధననాయకుఁడు మహాధనవంతుఁగాఁ జేయు
         నీశానదేవుఁ డభీష్ట మొసఁగు


తే.

బ్రహ్మవిష్ణుముఖామరప్రకరములును
సంయమీంద్రులు భాస్కరశశధరులును
సేమ మారసి నిన్ను రక్షింపుచుంద్రు
మిహిరసమతేజ నిద్దుర మేలుకొనుము.

239


క.

భవదీయజనకుననుమతి
నవనీభారము వహింప నభిషిక్తుఁడవై
యువరాజ్య మేలవలయును
బ్రవిమలమతి మేలుకొనుము పార్థివతనయా.

240


తే.

అబ్జబాంధవుఁ డుదయాద్రియందుఁ దోఁచె
నిదుర మేల్కాంచి పశుపతిపదయుగంబు
నాత్మ భావించి యాహ్నికం బాచరింపు
సకలభూపాలజనగేయ సౌమతేయ.

241


వ.

అని మఱియు బహుప్రకారంబులం బ్రశంసింపుచున్న
వైతాళికజనస్తోత్రపఠనారవంబులవలనను మతంగజఘటా
ఘీంకారంబులవలనను భేరీమృదంగాదివాద్యఘోషంబుల
వలనను నన్నరేంద్రనందనుండు మేల్కాంచి మౌనంబున
నొక్కింతదడవు దనమనంబునఁ బరమేశ్వరధ్యానం బొన
రించి తదనంతరంబునఁ గాల్యకరణీయంబు లాచరించి పితృ
మాతృప్రముఖగురుజనంబుల భూసురులకుం బ్రణామంబు
గావించి తదాశీర్వాదంబులు గైకొనుచుఁ బరమాహ్లాదం