పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/251

ఈ పుట ఆమోదించబడ్డది

244

బ్రహ్మోత్తరఖండము


మున మదీయపుత్రిక నొసంగి పాణిగ్రహణము గావించితి
నీ విప్పు డిక్కుమారు మాతృసహితమ్ముగాఁ దోడ్కొని
నిజనగరమునకుం జనుము నీవు శ్రేయోవర్ధనుండవై సుఖమ్ము
లనుభవింపం గలవని తనజామాత్రువాఙ్మూలమున సవిస్తర
ముగాఁ దెలియం జెప్పి యక్షణమ్మున.

215


మ.

కుముదాప్తప్రతిమాస్యఁగుందరదనం గుంభీంద్రకుంభస్తనిన్
సుమనోగంధవిరాజమానచికురన్ సూక్ష్మాలవగ్నన్ శర
త్కమలాక్షి న్మణిభూషణాంబరయుతన్ దాశార్ణభూభృత్సతిన్
సుమతిన్ బ్రేమను బిల్వబంచె నిషధక్షోణీశుఁ డచ్చోటికిన్.

216


తే.

మేఘనిర్గత మైన క్రొమ్మిం చనంగ
శంబరారాతి యాఱవశర మనంగ
దేవలోకాగతాప్సరస్త్రీ యనంగ
వారిరుహగంధి యచటికి వచ్చి నిలిచె.

217


వ.

ఇట్లు చనుదెంచిన.

218


క.

పాత్రులు క్షత్రియగోత్రప
విత్రులు శివభక్తు లైనవీరిరువురు నో
ధాత్రీశ భవత్పుత్త్రక
ళత్రము లని చూపి చెప్పె లలితమృదూక్తిన్.

219


సీ.

ఆవార్త యాలించి యావజ్రబాహుండు
        మహితవిస్మయరసమగ్నుఁ డగుచుఁ
దాను జేసినదుష్కృతము లెల్లఁ దలపోసి
         తనుఁ దాన నిందించుకొనుచు మఱియు
భవ్యతరానందపారవశ్యము నొంది
         పులకీకృతాంగవిస్ఫురితుఁ డగుచు