పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/250

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

243


వనఁ జంద్రాంగదభూవిభుండు దరహాసాస్యుండునై యిట్లనెన్.

214

చంద్రాంగదమహారాజు వజ్రబాహునకు భద్రాయుసుమతువృత్తాంతం బెఱింగించి మరల నొప్పగించుట

వ.

నరేంద్రా విను మితండు భవన్నందనుండు శైశవమున విష
వ్రణరోగపీడితుం డయియుండి విషవ్రణబాధాక్రాంత
యగుతల్లియుం దానును దదీయక్లేశము సహింప నోపక
యున్న నీచేతఁ బరిత్యక్తు లగుచు మహారణ్యంబునం బడి
పోవుచుఁ దెరు వెఱుంగక పరిభ్రమింపుచు నొక్కయెడఁ
బూర్వజన్మకృతపుణ్యవిశేషమున నొక్క వైశ్యపురంబుఁ
గని యచ్చట నావైశ్యనాథునిచేత సురక్షితులై యుండు
నంతఁ గతిపయదినములకు నబ్బాలకుండు మృతుం డయిన
నచ్చటికి దైవయోగంబున ఋషభుం డను శివయోగీం
ద్రుండు విచ్చేసి యబ్బాలకుం గాంచి దయార్ద్రభావం
బునఁ గ్రమ్మఱ సంజీవితుం జేసి యమ్మాతృకుమారుల
దేహంబులు దివ్యంబు లగునట్లుగా ననుగ్రహించి చని
కొంతకాలమునకు నయ్యోగీంద్రసార్వభౌముండు మరలం
జనుదెంచి యక్కుమారు బహుశ్రుతుం గావించి యనంతర
మున శైవవర్మం బుపదేశించి సకలశత్రుభీకరమ్ములయిన
ఖడ్గశంఖమ్ము లొసంగి వెండియు భస్మలేపనంబున ద్వాదశ
సహస్రనాగబలమునుం గలుగునట్లు కటాక్షించి చనినఁ
గొన్నిదినములకు భవదీయరాష్ట్రక్షోభవృత్తాంతమ్ము విని
యచ్చటికిఁ జని యమ్మాగధుల నందఱం బరాజితులం
గావించి మిమ్మందఱ నుద్ధరించిన మహానుభావుం డిప్పురుష
శ్రేష్ఠునకు మహాత్ముఁ డయినయాఋషభయోగీంద్రుశాసన