పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/246

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

239


బాలారత్నము నీకు నిత్తునని సంభావించి మ మ్మంపినన్
హాళి న్వచ్చితి మిత్తఱి న్వెడలు మత్యానందభావంబునన్.

195


క.

ఖ్యాతిగ నీ విపుడు భవ
న్మాతయుఁ బద్మాకరుండు మఱియుఁ దదీయ
భ్రాతృకళత్రసుపుత్త్రస
మేతముగా దర్లిరండు మిత్రయుతముగాన్.

196

భద్రాయువు వివాహార్థమై నిషధపురమునకు వచ్చుట

సీ.

అని విన్నవించిన యాప్రధానులపల్కు
        లాలించి భద్రాయు వపుడు వేడ్కఁ
గనకభూషణవస్త్రగంధానులేపన
        సరసాన్నముల వారి సత్కరించె
నంతఁ బద్మాకరుం డధికహర్షంబున
        నారాజనందను నభినుతించి
మంగళస్నానంబుఁ సంగతిఁ గావించి
        దివ్యభూషణదీప్తదేహుఁజేసి


తే.

రథికుఁగా నొనరించి తూర్యములు మ్రోయ
జననితోఁగూడ నతని దోడ్కొనుచు వచ్చె
నాత్మసతియునుఁ బుత్త్రుతో నరుగుదేర
నిఖిలభూసురయుక్తుఁ డై నిషధపురికి.

197


వ.

ఇవ్విధమున నిషధపురముఁ బ్రవేశించిన దశార్ణరాజ
నందను నెదుర్కొని చంద్రాంగదుండు వారల సకలవస్తు
పరిపూర్ణం బైనయొక్కనివేశనంబున విడియించి తత్పురం
బతిసుందరంబుగా నలంకారంబు గావించిన నదియును
ననేకతోరణమాలికాలంకృతంబును కర్పూరగంధసారమృ