పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/245

ఈ పుట ఆమోదించబడ్డది

238

బ్రహ్మోత్తరఖండము


యోగీంద్రుం డానతిచ్చిన వృత్తాంతం బంతయు సవిస్త
రంబుగా వారల కెఱింగించి తదనుమతంబున నారాజనం
దనుం దోడ్తేర నుచితజ్ఞు లయిన ప్రధానులం బిలువం
బంచి.

192

చంద్రాంగదమహారాజు భద్రాయువును శుభలేఖ వ్రాసి పిలిపించుట

సీ.

శ్రీమత్సదాశివశ్రీపాదరాజీవ
         మధుపాయమానసన్మానసుండు
తక్షకనాగేంద్రదత్తఖడ్గతురంగ
         భూషణాంబరజాతతోషణుండు
చంద్రాంగదుండు రాజన్యచూడామణి
         శ్రీయుతుం డైనభద్రాయువునకు
నాశీర్వదించి వృత్తాంతంబు వ్రాయించి
         పంపినలిఖిత మేర్పడఁగ వినుము


తే.

నీకుఁ గూర్మి వెలయ నాపేర్మిసుత నిత్తు
వైభవమున నీవు వైశ్యపతియు
బ్రాహ్మణోత్తములును భవదీయజననియు
నరుగుదెంచి పెండ్లి యాడవలయు.

193


చ.

అని లిఖియించి పంపినఁ దదాజ్ఞ శిరంబునఁ దాల్చి సత్వరం
బునఁ జని మంత్రిసత్తములు పొల్పుగ వైశ్యపురంబుఁ జొచ్చి నె
మ్మనములు పల్లవింప నసమానబలోజ్జ్వలు వజ్రబాహునం
దనుఁ గని మ్రొక్కి భద్రలిఖితంబు లొసంగుచుఁ బల్కి రొక్కటన్

194


శా.

ఆలస్యం బిఁకఁ జేయఁగావలదు కల్యాణంబు సంధిల్లె ను
ద్వేలప్రాభవధుర్యుఁ డైననిషధోర్వీనాయకుం డాత్మలో