|
యోగీంద్రుం డానతిచ్చిన వృత్తాంతం బంతయు సవిస్త
రంబుగా వారల కెఱింగించి తదనుమతంబున నారాజనం
దనుం దోడ్తేర నుచితజ్ఞు లయిన ప్రధానులం బిలువం
బంచి.
| 192
|
చంద్రాంగదమహారాజు భద్రాయువును శుభలేఖ వ్రాసి పిలిపించుట
సీ. |
శ్రీమత్సదాశివశ్రీపాదరాజీవ
మధుపాయమానసన్మానసుండు
తక్షకనాగేంద్రదత్తఖడ్గతురంగ
భూషణాంబరజాతతోషణుండు
చంద్రాంగదుండు రాజన్యచూడామణి
శ్రీయుతుం డైనభద్రాయువునకు
నాశీర్వదించి వృత్తాంతంబు వ్రాయించి
పంపినలిఖిత మేర్పడఁగ వినుము
|
|
తే. |
నీకుఁ గూర్మి వెలయ నాపేర్మిసుత నిత్తు
వైభవమున నీవు వైశ్యపతియు
బ్రాహ్మణోత్తములును భవదీయజననియు
నరుగుదెంచి పెండ్లి యాడవలయు.
| 193
|
చ. |
అని లిఖియించి పంపినఁ దదాజ్ఞ శిరంబునఁ దాల్చి సత్వరం
బునఁ జని మంత్రిసత్తములు పొల్పుగ వైశ్యపురంబుఁ జొచ్చి నె
మ్మనములు పల్లవింప నసమానబలోజ్జ్వలు వజ్రబాహునం
దనుఁ గని మ్రొక్కి భద్రలిఖితంబు లొసంగుచుఁ బల్కి రొక్కటన్
| 194
|
శా. |
ఆలస్యం బిఁకఁ జేయఁగావలదు కల్యాణంబు సంధిల్లె ను
ద్వేలప్రాభవధుర్యుఁ డైననిషధోర్వీనాయకుం డాత్మలో
|
|