పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/243

ఈ పుట ఆమోదించబడ్డది

236

బ్రహ్మోత్తరఖండము


జనియెను యోగీశ్వరుండు చంద్రాంగదుఁడున్
దనపత్నియైన సీమం
తిని యనుమతి వడసి యుండె దృఢనిశ్చయుఁ డై.

187


వ.

అంత నమ్మహీనాథుండు సుఖనిద్రం జెంది యుండు నాసమ
యంబున.

188


తే.

వాసరాధీశ్వరుండు దా వచ్చునపుడు
జనుల కెఱిఁగించు వాద్యనిస్వనము లనఁగ
జారచోరులగుండియల్ ఝల్లు మనఁగఁ
గొక్కొరోకో యటంచును గోళ్లు గూసె.

189


సీ.

పద్మాకరంబులఁ బద్మముల్ వికసించెఁ
         గమనీయతరహల్లకములు మోడ్చెఁ
బరిమళాన్వితశీతపవమానములు వీచెఁ
         బక్షులకలకలార్భటులు మించెఁ
జక్రవాకములకు సౌఖ్యంబు సేకూఱె
         వితతకాపోతహుంకృతులు మించె
దధిమథనప్రణాదంబులు వీతెంచె
         వత్సంబు లంభారవముల నెసఁగె


తే.

ముదిత భూపాలగౌళాదివిదితరాగ
గీతములు మ్రోసె దేవతాగేహములను
వేదపాఠరవంబులు వెలయుచుండె
లాలితం బైనప్రత్యూషవేళయందు.

190


సీ.

యజనాభిరతులు ద్రేతాగ్నులు ప్రణయింప
          మునివరేణ్యులు సాఁగి మ్రొక్కుచుండ
అధ్వన్యజనులు దేశాంతరంబుల కేఁగ