పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/242

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

235

ఋషభయోగీశ్వరుఁడు చంద్రాంగదునియుద్దికిఁ జని భద్రాయువునకుఁ గూతునిచ్చి వివాహంబు సేయుమని యుపదేశించుట

క.

వృషభధ్వజావతారుఁడు
ఋషభుం డారాత్రియందు ఋషులు నుతింపన్
ధిషణప్రజ్ఞాబలుఁ డై
నిషధేంద్రునిపురికి వచ్చె నెమ్మి దలిర్పన్.

184


వ.

ఇట్లు విచ్చేసిన ఋషభయోగీంద్రునకుఁ జంద్రాంగదమహీ
పాలుం డెదుర్కొని యభివందనంబులు గావించి యర్ఘ్య
పాద్యాదివిధులం బూజించి కనకాసనంబున గూర్చుండ నియ
మించి యున్నసమయంబున నన్నరనాథునితో యోగీంద్రుం
డి ట్లనియె.

185


సీ.

విను నైషధేశ్వర వినుపింతు నొకవార్త
          దాశార్ణపతికి భద్రాయు వనఁగ
జనియించి నిజమాతృసహితంబుగాఁ దమ
          తండ్రిచేతను బరిత్యక్తుఁ డగుచు
నొకవైశ్యపురమున నుండ నంతట గత
          ప్రాణుఁ డై యున్నయాబాలు మఱల
సంజీవితుని జేసి శైవధర్మం బుప
          దేశించి ధీమంతుఁ జేసినాఁడ


తే.

నతఁడు మాగధుఁ గెల్చి జయంబుఁ గాంచి
జనకునకుఁ గ్రమ్మఱంగ రాజ్యంబు నొసఁగె
నట్టిరాజాత్మజునకు నీయనుఁగుపుత్త్రిఁ
గీర్తిమాలిని నిమ్ము సత్కీర్తి వెలయ.

186


క.

అని యానతిచ్చి క్రమ్మఱఁ