పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/237

ఈ పుట ఆమోదించబడ్డది

230

బ్రహ్మోత్తరఖండము


మ్మునఁ బంచత్వమ్ము నొందువారును వినమ్రభావమ్ముఁ
జెంది పాదాక్రాంతు లగువారును మహాభయబ్రాంతు లై
గంపమ్మునొందువారును నై యున్నసమయమున వెండియు
నమ్మహాబలుండు రోదసీకుహరపరిపూర్ణమ్ముగా శంఖధ్వానంబు
జేసినఁ దదీయభీషణఘోషణం బాలకించి యమ్మాగధులు
మూర్ఛాగతు లై రథికసారథినిషాదిసాదిపదాతిసహితముగాఁ
బరిత్యక్తశస్త్రాస్త్రు లయి భూతలమ్మున బడియున్నవారలం
గని యతండు ధర్మశాస్త్రమర్మజ్ఞుండు గావున మృత
ప్రాయులు నిరాయుధు లయినపురుషులు వధ్యులుగారని
వారల విసర్జించి రణాంగణమ్మున బద్ధుం డై యున్ననిజ
జనకుని బంధముక్తుం గావించినఁ గ్రమ్మఱఁ దత్పత్నీనివహ
మ్మును దత్ప్రధానబంధుజనపురోహితప్రముఖపౌరజానపద
వర్గమ్మును మఱియును గోవృషాదికమ్మును బంధనిర్ముక్తత
నొందించి విషాదవ్యాకులచిత్తు లయియున్నవారలనందఱ
నత్యంతమధురాలాపమ్ముల ననునయించి యనంతరంబ మదీయ
రాష్ట్రభంగంబుఁ గావించి యిద్దురాత్ముల మానభంగంబు
చేయుట యుచితం బని నిశ్చయించి.

158


మ.

మగధాధీశ్వరుఁ డైనహైమరథుదుర్మానంబుఁ దూలించివాఁడై
జిగజస్యందనతత్ప్రధానసఖిదాసీబంధువర్గంబుతో
మగుడన్ బద్ధునిఁ జేసి తోడ్కొనుచు శుంభద్విక్రమోల్లాసుఁ డై
నగరద్వారముఁ జొచ్చె రాజసుతుఁ డానందంబు సంధిల్లఁగన్.

159


తే.

లావు చెడి సంగరమున పలాయమాను
లైనయోధులు గ్రమ్మఱ నరుగుదెంచి
జనకబాంధవసచివాదిసహితుఁ డైన