పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/236

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

229


వ్రాతంబులును విచ్ఛిన్నంబు లయినకేతనఛత్రచామరంబు
లును విశీర్ణంబు లయినతనుత్రాణంబులును విభిన్నంబు
లయినమురజమృదంగపటహకాహళనిస్సాణాదికంబులును
వివర్ధమానంబు లయినశోణితనదీప్రవాహంబులును విజృంభ
మాణంబు లయిన భూతబేతాళకలకలారావంబులును
గలిగి సంగ్రామరంగం బత్యంతభీషణం బై యుండె
నయ్యవసరంబున.

155


క.

జన్యంబు సేయ నొల్లక
దైన్యంబును జెంది మదికిఁ దత్తర మొదవన్
సైన్యేశులు హరిఁ గాంచిన
వన్యేభము లట్ల చని రవారితభీతిన్.

156


ఉ.

హైమరథుండు భీతి జను నాత్మబలంబులఁ గాంచి పల్కె నీ
భీమబలోద్ధతుం డెవఁడొ వీనిమదం బణఁగింతు రండు సం
గ్రామమునందు శూరులు పరాజితు లై చనరా దటంచుఁ దా
సామవచఃప్రసంగముల సైనికుల న్మరలించెఁ గ్రమ్మఱన్.

157


వ.

ఇట్లు మగధరాజప్రయత్నమున నెట్టకేలకు సైనికులు మరలి
చతురంగబలసమేతు లయి చనుదెంచి యొక్కుమ్మడి
నాభద్రాయువుం జుట్టుముట్టి యనేకవిధమ్ము లయినశక్తి
శూలపరశ్వథభిండివాలగదాకుంతతోమరక్షురికా
ముసలాదిసాధనముల నొప్పించిన నతఁ డట్టహాసంబు సేసి
ఋషభయోగీంద్రుం దనమనమ్మునం దలంచి కరాళమృత్యు
జిహ్వాభీలంబును మహోగ్రప్రభాజాలంబును ధగద్ధగాయ
మానమ్మును నైనకరవాలము కేల నమర్చి ఝళిపించిన దద్ద
ర్శనమాత్రమ్మున శిఖిశిఖాజాలమ్ము డగ్గఱినశలభమ్ములవిధ