పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/233

ఈ పుట ఆమోదించబడ్డది

226

బ్రహ్మోత్తరఖండము


దండనాయకముఖ్యు లుద్దండవృత్తిఁ
బట్టణంబు చరాచూఱ బెట్టి రపుడు.

143


క.

గజవాజిరథోష్ట్రంబుల
నజగోమహిషాదికముల నంబరతతులం
గజగమనల హరియించిరి
రజతస్వర్ణధనధాన్యరత్నావళులన్.

144


వ.

ఇవ్విధమున నమ్మాగధప్రధానులు రాజభవనముఁ జొచ్చి
యందు భాండాగారమునం గల యనేకధనకనక మణిభూష
ణాంబరములును సువర్ణరజతగజదంతమయమ్ములయిన శిబి
కాశయనవాహనమ్ములును మొదలయిన సమస్తరాజద్ర
వ్యము లన్నియుఁ దన్మహిషీసమేతముగా నపహరించి
నిర్భయత్వముగా నిజనగరమున కేఁగుచున్న సమయమున
నద్దేశంబంతయు నరాజకం బయి మగధసైన్య పరిక్షుబ్ధం
బయ్యె నంత బాలవృద్ధవనితాజనంబులు భయాక్రంద
నంబు లొనరింపుచుఁ బ్రణష్టధనధాన్యపశుభూషణాం
బరులయి యథేచ్ఛాగమనములం జనుచుండి రంత.

145


మ.

మగధేశుండు దశార్ణదేశముల శుంభద్విక్రమాభీలుఁడై
తగసప్తాంగములన్ హరించె ననువృత్తాంతంబు దేశాగతా
ధ్వగబృందంబు వచింప రాజసుతుఁడౌ భద్రాయు వాలించి
పన్నగరాజప్రతిమానరోషమున జన్యాకాంక్షితోద్యుక్తుఁడై.

146

భద్రాయువు మాగధుని జయించి తనతండ్రికి మరల రాజ్యము నిచ్చుట

మ.

గురుదత్తోచితఖడ్గశంఖధరుఁ డై కోదండభృత్పాణి యై
శరసంపూర్ణనిషంగుఁ డై కవచియై శౌర్యప్రభావాఢ్యుఁడై