పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/232

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

225


క.

ఘోరారివీరవిశిఖా
సారంబున వజ్రబాహుసైన్యంబున హ
స్త్యారోహకయారోహక
సారధిరథికాదులెల్ల సమసి రనేకుల్.

137


క.

వారును బిఱుతివియక తమ
పౌరుషములు మెఱయ మగధపతిసైన్యమునన్
వారణవాజిస్యందన
వీరభటులఁ గూల్చి రపుడు విస్మయ మొదవన్

138


మత్తకోకిల.

ఈతెఱంగున రెండుసేనలు హెచ్చుతగ్గులు లేక వి
ఖ్యాతిఁ బోరుచు నుండ నందు దశార్ణయోధులు విద్విష
చ్ఛాతబాణపరంపరాహతిజర్జరీకృతదేహులై
భీతులై కకుభాళి కేఁగి రపేతవాహనశస్త్రులై.

139


వ.

తదనంతరంబున.

140


క.

అలఘుప్రాభవయుతులై
చలమున నమ్మగధరాజసైన్యంబులు దో
ర్బల మెసఁగ దశార్ణునితోఁ
దలపడి పోరాడి రపుడు దర్పోద్ధతు లై.

141


ఉ.

కొందఱు చాపదండమును గొందఱు కేతువుఁ గొంద రశ్వము
ల్గొందఱు సారథిన్ రథముఁ గొందఱు ఖడ్గము ఖేటకంబునున్
గొందలమందఁజేసి ధరఁ గూల్చి పదంపడి వజ్రబాహునిన్
సందిటఁ బట్టి కట్టిరి భుజాబలశోభితు నాక్షణంబునన్.

142


తే.

ఇట్లు బంధించి తెచ్చి నిజేశ్వరునకు
నొప్పగించి తదాజ్ఞచే నుత్సహించి