పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/230

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

223


విమ్మహాశైవకవచమువలనను ఖడ్గశంఖప్రభావమువలనను ద్వా
దశసహస్రనాగబలమువలనను భస్మధారణసామర్థ్యమువల
నను శత్రుభూపతుల బరాజితులం గావించి పిత్ర్యంబయిన
భవద్రాజ్యమున కభిషిక్తుండవై యనేకసంవత్సరములు
సామ్రాజ్యభోగముల ననుభవింపఁగలవాఁడ వని యానతిచ్చి
సమాతృకుం డయిన భద్రాయువు నాశ్వాసించి మహాను
భావుం డయిన ఋషభయోగీంద్రుండు నయ్యిరువురచేతఁ
బూజితుండయి యథేచ్ఛావిహారమ్మునం జనియె చెప్పిసూతుం
డమ్మహామునీంద్రుల కి ట్లనియె.

128


సీ.

మునివరోత్తములార వినుఁ డిమ్మహాశైవ
        కవచంబు సర్వరక్షాకరంబు
నిర్మలహృదయులై నిరతంబు సద్వృత్తిఁ
        బఠనంబు చేసిన భక్తులకును
బహుతరైశ్వర్యసంపదలు ప్రాపించినఁ
        గలుషబృందంబులు దొలఁగిపోవు
సకలశుభంబులు సమకూఱు నెప్పుడు
        నిష్టార్థసంసిద్ధి నెసఁగుచుండుఁ


తే.

బుత్త్రమిత్రకళత్రాదిభోగభాగ్య
సౌఖ్యములు చెందుఁ జేకూఱు సమ్ముదంబు
శ్రీసదాశివుకరుణచే సిద్ధముగను
వారలకు సంఘటించుఁ గైవల్యపదము.

129


ఆ.

ఆనృపాలసతియు నాత్మజుండును దాను
రాజకళలు వెలుఁగ రమ్యవృత్తి
నద్రిజాకుమాఱు లట్టులఁ జెలువొంది