పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/228

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

221


రగణంబుల మారణంబుగా విదళింపుము కూశ్మాండమారీ
గణబ్రహ్మరాక్షసనివహంబులకు సంత్రాసంబు గావింపుము
క్షుత్తృష్ణాతురుండ నగు నన్ను నాప్యాయనంబు నొందం
జేయుము దుఃఖార్తుండ నగునన్ను నానందుండ నగునట్లుగా
బ్రసాదింపుము మరణభయంబువలన సంజీవితుంగా నొన
ర్పుము నరకభయంబులవలన న న్నుద్ధరింపుము శివకవచం
బున నన్ను నాచ్ఛాదింపుము సదాశివుండ నైననీకు బహు
వందనంబులు గావింతు ననుచు ననేకవిధంబులుగాఁ బ్రార్థింప
వలయు నని చెప్పి వెండియు నారాజనందనునకు ఋషభుం
డి ట్లనియె.

122


సీ.

అవనీశనుత విను మతిరహస్యం బైన
        కవచంబు నాచేతఁ గలితమయ్యె
నదియును బాపత్రయధ్వాంతమిహిరంబు
        దారుణాపద్వినివారణంబు
సకలసౌభాగ్యైకసామ్రాజ్యసదనంబు
        పశుపతికారుణ్యభాజనంబు
నీశైవకవచంబు నేకాగ్రచిత్తులై
        హితమతిఁ బఠియింతు రెవ్వరేని


తే.

వారు శ్రీసాంబశివునికృపారసమున
నతిశయవ్యాధిమృత్యుభయంబు లుడిగి
చిరతరాయుష్కు లగుచు లక్ష్మీకటాక్ష
పాత్రులై బహుసౌఖ్యము ల్పడయఁగలరు

123


క.

కావున భక్తిశ్రద్ధా
ప్రావీణ్యము లొప్ప నీవు పఠియింపుము రా