పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/214

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

207


జపముల మంత్రౌషధముల సత్క్రియల మహా
నిపుణతల నెంతవారికి
విపులం బగుమృత్యుభయము విడుచునె చెపుమా.

57


ఆ.

మేనినీడపగిది మృత్యువు వర్తింప
జనుల కెట్లు సుఖము సంభవించు
వ్యాఘ్ర మెదుటనుండ వనమృగంబులకును
హర్ష మగునె మేఁత లారగింప.

58


వ.

అని చెప్పి వెండియు నమ్మహాత్ముం డి ట్లనియె.

59


శా.

ధీరోదాత్తుఁడనై వచింతు విను సాధ్వీసంచితాగామిక
ప్రారబ్ధాఘములెల్లఁ బాయుటకు నశ్రాంతంబు సద్భక్తితో
నారాధింపుము నీమనంబున విరూపాక్షున్ జగద్రక్షకున్
గౌరీవల్లభు నీలకంఠు నభవున్ గంగాధరున్ శంకరున్.

60


క.

అని యానతిచ్చి యిఁక నీ
మనమున శోకోపశమన మయ్యెనొ లేదో
వినుపింపు మనిన యోగీం
ద్రునిఁ గనుఁగొని యింతి పలికె దుఃఖితమతియై.

61


మ.

వరయోగీంద్ర భవత్కటాక్షమున భాస్వన్ముక్తి చేకూఱె నే
నరయ న్బాంధవభర్తృపుత్త్రకులఁ బాయం ద్రోచి యేకాంగినై
గరళక్లిష్టశరీర నైతిఁ నిఁక శోకవ్యాక్కుల న్మాన్పఁగా
మరణోపాయము దక్క నొండు గలవే మంత్రౌషధప్రక్రియల్.

62


వ.

అట్లు గావున నేను నీబాలకసహితంబుగా నరిగెద మరణో
పాయం బెఱిఁగింపవలయు నని దైన్యరసంబు దోఁపం బలికిన
యారాజపత్నివాక్యంబు లాకర్ణించి కారుణ్యసార్ద్రచిత్తుఁ
డై యమ్మహానుభావుండు సకలధర్మజ్ఞుండును గృతజ్ఞుండును