పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/210

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

203


తాపముఁ జెందుఁగాని మరణంబు లభింపకయుండ వ్రాసె నే
కాపురుషుండు బ్రహ్మ యెటుగా నిఁక దాఁటెద దుఃఖవారిధిన్.

39


సీ.

తనసపత్నుల కేరికిని లేక నావంటి
         పాపిష్ఠి కేల గర్భంబు గలిగెఁ
గలిగిన నేమాయెఁ గాపట్యమునఁ గాంత
         లీరీతిని విషాన్న మిడఁగఁ దగునె
ఇడినమాత్రన ప్రాణ మెడలకుండఁగ నేల
         బహుతాపవేదనాభార మొదవె
నొదవెనే నిజభర్త యదయుఁడై మనమున
         నడవులపాలుగా విడువనగునె


తే.

విడిచెఁబో భైక్ష్యవృత్తి జీవింపకుండ
దైవ మీచందమున దయఁ దప్పఁదగునె
యిన్నిటికి మత్పురాకృతం బింతచేసెఁ
గాక వేఱొండు గలదె యోరాకుమార.

40


క.

పతిసంత్యక్త ననాథను
గతబాంధవఁగృపణవిపులకలుషాత్మక న
న్నతిదుఃఖాంబుధిఁ ద్రోయుచు
సుత యెక్కడఁ బోతి వనుచు శోకించునెడన్.

41

ఋషభయోగి సుమతికిఁ దత్వోపదేశంబు చేయుట

తే.

ఆవధూటివిషాదంబు నపనయింప
శక్తు లెవ్వరు లేకున్నసమయమునను
వచ్చెఁ దచ్ఛోకదుర్వ్యాధివైద్యుఁ డగుచుఁ
బూర్వవర్ణితశివయోగిపుంగవుండు.

42


ఉ.

అక్షసరంబు పాదుకలు నంచితభూతివిలేపనంబు రు