పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/209

ఈ పుట ఆమోదించబడ్డది

202

బ్రహ్మోత్తరఖండము


ల్యమ్ముల నౌషధక్రియల నాదరణం బొనరించి మాతృసా
మ్యమ్ముగఁ బూజ సేసె బుధమాన్యుఁడు వైశ్యవిభుండు నెమ్మితోన్.

34


ఉ.

ఆనిలయంబునందు వసుధాధిపగేహిని యాత్మసూనుఁడుం
దాను వసించి యుండ నిరతంబును వైద్యులఁ బిల్వఁబంచి స
న్మానమొనర్చి వైశ్యపతి నవ్యవిషాపహరౌషధంబు లె
న్నేని యొసంగె వారలకు నిష్కపటంబుగ ధర్మకాంక్షియై.

35


క.

ఎన్ని చికిత్స లొనర్చిన
నున్నతముగఁ బూదిలోనిహోమం బగుచు
న్నెన్నాళ్లకు రుజమానక
క్రన్నన నాశిశువు చనియె గతజీవుం డై.

36

మృతుం డైనకుమారునిం గూర్చి సుమతి విలపించుట

వ.

ఇట్లు విగతప్రాణుండై పడియున్న నిజకుమారుం గాంచి
యారాజపత్ని హాహాకారంబులు సేయుచు నత్యంతవిషా
దంబునఁ బరిదేవనం బొనరింపుచున్న సమయంబున నయ్యా
క్రందనధ్వని విని పురంబునం గలవైశ్యస్త్రీజనంబు లచ్చ
టికిం జనుదెంచి బహువిధంబు లగుస్వాంతనాలాపంబుల
నూరడింపుచుండ నయ్యింతియుఁ దద్దయు ఖేదంబున నా
బాలకునుద్దేశించి.

37


క.

హా రాజసన్నిభానన
హా రాజకుమార ధీర హా సుకుమారా
హా రవిసన్నిభతేజా
హా రమణీయాంగ యనుచు నాక్రందించెన్.

38


ఉ.

పాపము లెన్ని చేసితినొ బాలక పూర్వభవంబునందు న
త్యాపదఁ జెందె నిప్పు డహహా విషవేదనచే నితాంతసం