పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/208

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

201


బాటతలంబున వెలసిన
పేటఁ బ్రవేశించె నపుడు ప్రియము దలిర్పన్.

30


సీ.

ఆవైశ్యపురమున కధినాథుఁడై యుండు
        పద్మాకరుం డనుభద్రయశుఁడు
గురుకృషివాణిజ్యగోరక్షణరతుండు
        ధనవంతుఁ డత్యంతధార్మికుండు
అతనిమందిరదాసి యరుదెంచి యారాజ్ఞి
        నీక్షించి యడిగె నీ వెవ్వరనుచు
నడిగినయింతితో నారాజమహిషియుఁ
       దనదువృత్తాంత మంతయు వచించె


తే.

నంత నావార్త యాలేమ యరసి వచ్చి
సంభ్రమము దోఁపఁగా నిజస్వామితోడ
విన్నవించిన నతఁడు సవిస్మయముగ
నావధూమణి రప్పించి యాదరించి.

31


క.

తనవృత్తాంతం బడిగిన
విని యాసతి దనకు సవతి విష మొసఁగుటయుం
దనబాలకునియవస్థయుఁ
దనదుపరిత్యాగమును యథాస్థితిఁ జెప్పెన్.

32


తే.

అంత నారాజ్ఞివచనంబు లాలకించి
యావణిక్పతి దనమది నహహ యెంత
కష్టమొందె నటంచును గాఢచింత
నొంది తలయూఁచి కారుణ్యయుక్తుడగుచు.

33


ఉ.

అమ్మదిరేక్షణ న్నిజగృహాంతికసీమ రహస్య మైనగే
హమ్మున నుంచి దివ్యశయనాసనభోజనపానవస్త్రమా