పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/207

ఈ పుట ఆమోదించబడ్డది

200

బ్రహ్మోత్తరఖండము


క్షురాశ్మకంటకప్రచ్ఛిన్నపాదయు ముక్తకేశియు భయ
భ్రాంతచిత్తయునై ప్రాగ్జన్మదురితకర్మంబుల నిందించుకొనుచు
నిట్టూర్పు లెగయ ధరణీతలంబునం బడుచు లేచుచు మంద
మందగమనంబుల నరుగుచున్నంత.

25


మ.

ఒకచో వ్యాఘ్రమహారవంబు లోకచో నుద్దండభల్లూకగం
డకసారంగవృకస్వనంబు లొకచోటన్ భూతబేతాళగు
హ్యకశబ్దంబులు నొక్కతావున మహోద్యద్బ్రహ్మరక్షఃపిశా
చకహుంకారము లాలకింపుచు నికుంజవ్రాతము ల్దూరుచున్.

26


క.

దుర్గమకాంతారమహీ
మార్గంబులు దప్పి మరల మరలం జనుచు
న్నిర్గళితసకలసుఖయై
దుర్గంబు లతిక్రమించి తొయ్యలి యంతన్.

27


శా.

ఆరాజాంగన బాలు నెత్తుకొని ఘోరారణ్యదేశంబులన్
ధీరప్రజ్ఞ నతిక్రమించి హయదంతిస్యందనాకీర్ణమున్
దూరీభూతభయంబు సర్వజనసందోహాన్వితం బైనకా
శీరామేశ్వరసత్పథం బొకటి గాంచెన్ దైవయోగంబునన్.

28

సుమతి దైవవశంబునఁ బద్మాకరుం డనువైద్యునిపట్టణంబుఁ జేరి యతనిచే మన్ననలఁ బొందుట

క.

నరనాథకుటుంబిని యా
తెరువునఁ జని కొంతవడికి దృఢమతి నానా
వరనారీశోభితమై
మురువగు నొకవైశ్యపురము ముందటఁ గాంచెన్.

29


క.

హాటకరత్నధనంబులఁ
గోటికిఁ బడగెత్తినట్టికోమటు లొప్పం