పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/206

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

199

వజ్రబాహుండు తనజ్యేష్ఠభార్యయైన సుమతిని పుత్రసహితంబుగా నరణ్యంబున కనుచుట

వ.

అని నిశ్చయించి యాభూనాథుండు కనిష్ఠపత్నీవ్యాస
క్తుండు గావున నిజసారథిం బిలిచి నీ విక్కామినీడింభకుల
నరదంబుపై నిడుకొని మనదేశంబు వెడలునంతకుం గొని
పోయి విజనప్రదేశంబున వారలం డించి రమ్మని పంచిన
వాఁడును "వల్లె" యని రాజశాసనప్రకారంబున బహు
యోజనవిస్తారం బయినదూరంబు గొనిపోయి యచ్చట.

22


శా.

క్రూరవ్యాళభయానకంబు బహురక్షోగుహ్యకాభీలమున్
వీరచ్ఛన్నము నైనకాఱడవి దుర్వృత్తి న్విసర్జించి ని
ష్కారుణ్యుం డగుసూతుఁ డేఁగిన మహోత్కంపంబు దీపింపఁగా
నారాజాంగన యంతటం జనియెఁ గొండారణ్యమార్గంబునన్.

23


క.

ఘోరవ్యాఘ్రమృగాదన
వారణగవయాచ్ఛభల్లవానరఝల్లీ
దారుణ మగుకాననమున
దారకు నెత్తుకొని చనియెఁ దరళేక్షణయున్.

24


వ.

ఇట్లు వాతాతపదుర్గమంబును నిర్మనుష్యంబును వేత్రకీచక
వేణుకంటకపాదపలతాకీర్ణంబును నైనయమ్మహారణ్యమార్గం
బునంబడి యారాజభామిని ఝల్లీరవంబులకు నులుకుచు
కంకకాకగృద్రోలూకఘూత్కారంబులకు భయంబు నొందు
చు వనమదేభంబులం గాంచి పలాయనంబు నొందుచు
వరాహమహిషజంబుకమార్జాలాదిక్రూరమృగసంచా
రంబులకు వెఱచుచుం జనుచున్న సమయంబున గమనా
శక్తయు క్షుత్పిపాసాతురయు శీతవాతాతపక్లాంతయు