పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/205

ఈ పుట ఆమోదించబడ్డది

198

బ్రహ్మోత్తరఖండము


తే.

ఘోరతరమైనతద్విషం బారగించి
సుమతి మృతి దప్పె దైవయోగమునఁ జేసి
యంత సంతాపదుస్సహం బౌనవస్థఁ
జెందియుండె మదేభేంద్రమందగమన.

16


శా.

ఆలో నొక్కదినంబునందుఁ దనయుం డారాజ్ఞికిం బుట్టె ను
ద్వేలాక్రందనఘోషణాన్వితుఁడు దుస్తేజుండునై దుస్సహ
క్ష్వేళప్రాప్తమహాప్రణాళి నతివిచ్ఛిన్నాంగుఁడై యుండె నా
బాలుం డట్లనయుండు తజ్జననియున్ బాధాపరీతాత్మయై.

17


క.

ఆరాజు నిజకళత్రకు
మారులకు విషాపహరణమంత్రౌషధస
త్కారంబు లాచరించిన
నారోగ్యత లేక యుండి రతిదుఃఖితులై.

18


తే.

ఇ ట్లహోరాత్రములు రోదనేచ్ఛఁ దగిలి
యున్నఁ జూచి యసహ్యత యొదవుచుండ
బంధుమిత్రపురోహితప్రముఖజనులఁ
గాంచి నరపతి పల్కె నిష్కరుణుఁ డగుచు.

19


క.

ఈరమణీసుతు లతివి
స్తారాంహోజాతరోగతాపవ్యధితు
ల్వీరలకతమున నిద్రా
హారంబులు దూరమయ్యె ననవరతంబున్.

20


క.

నరకాలయులై యిచ్చటి
కరుదెంచినవారు వీరి నతిదూరముగాఁ
బరపెద దేశము వెడలన్
జిరతరరోగార్తులను విశీర్ణాకృతులన్.

21