పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/200

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

193


న్నరపతిచే నర్చితుఁడై
యరిగె భరద్వాజమౌని యాశ్రమమునకున్.

302


మ.

జనము ల్మేలనఁగా జగజ్జననికిన్ సద్భక్తితో మ్రొక్కి పా
వనశీలుం డగుతాపసేంద్రుని భరద్వాజున్ బ్రశంసింపుచున్
మునిసంకాశుని నావిదర్భనృపతిన్ మన్నించి దీవించుచుం
జని రాభూసురు లాత్మగేహములకున్ సంతుష్టచేతస్కులై.

303


ఆ.

ఆసుమేధునకును నాసోమవతి నిచ్చి
పెండ్లిఁ జేసె గురుఁడు ప్రీతి యలర
నావధూరమణులు నత్యంతసౌఖ్యంబు
లనుభవింపుచుండి రనుదినంబు.

304


వ.

తదనంతరంబున.

305


క.

సారస్వతునకు వంశో
ద్ధారకుఁడును సత్కళానిధానుం డగుచున్
గౌరీప్రభావమహిమను
భూరిగుణోదారుఁ డొకసుపుత్త్రుఁడు పుట్టెన్.

306


క.

ఈసోమవారసువ్రత
భాసురకథ విన్నపుణ్యపరులకు విజయ
శ్రీసౌభాగ్యశుభంబులు
శ్రీసాంబశివుం డొసంగుఁ జిరతరకరుణన్.

307


వ.

అని యివ్విధంబున సీమంతినీప్రభావంబును శంభుమాహాత్మ్యం
బునుం దెలియం బలికిన విని యమ్మహామునులు పరమప్రహృష్ట
హృదయులై సూతుం బ్రశంసించి మఱియును శివభక్తలక్ష
ణంబు లెఱింగింపుమని యడుగుటయును.

308