పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

13


తే.

యనఁగ విలసిల్లి లక్ష్మినారాయణప్ప
పాలి సౌభాగ్యలక్ష్మి యై ప్రబలుచుండు
స్థిరకృపాలంబ పోషితద్విజకుటుంబ
సోమసంకాశముఖబింబ సుబ్బమాంబ.

50


తే.

కంతుసన్నిభుఁ డైన చెంగల్వరాయ
ఘనుఁడు రామాయణంబు చిక్కప్పపుత్త్రిఁ
జెంచమాంబను వరియించె నంచితముగ
ఫల్గునుండు సుభద్రఁ జేపట్టినట్లు.

51


వ.

అంత.

52


క.

ఆరామఘనుఁడు లక్ష్మీ
నారాయణధీరుఁడును జనస్తుత్యగుణో
దారతఁ బేరొందిరి కా
శీరామేశ్వరసుమధ్యసీమలయందున్.

53


వ.

మఱియు నమ్మహాప్రధానశేఖరులు శ్రీరామచంద్రచరణార
విందమరందబిందుబృందాస్వాదనతుందిలేందిందిరాయ
మానానందమానసులును నిరంతరాన్నదానసంతర్పితా
నేకభూసురాశీర్వాదసంపన్నులును మహావిభవాభిరాము
లును సమస్తజనమాన్యులును సకలసద్గుణసంపన్నులును
బరేంగితజ్ఞాననిపుణులును నీతికార్యవిదులును బరోపకారు
లును బరస్పరసౌభ్రాత్రకులును నై యనవరతంబు నఖిల
బాంధవమిత్రపుత్త్రవిద్వజ్జనకవిగాయకపౌరాణికసహి
తంబుగా నిష్టకథానులాపంబులఁ బ్రొద్దుఁ గడపుచుండి
యొక్కదివసంబున సప్తసంతానలాభమహాభిలాషంబు మనం