పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/199

ఈ పుట ఆమోదించబడ్డది

192

బ్రహ్మోత్తరఖండము


కృపకుం బాత్రునిఁ జేయుము
కపిలాదిమునిస్తుతాంఘ్రికమల భవానీ!

298


సీ.

అనుచుఁ బ్రార్థించిన నానృపాలుని జూచి
        యంబికాదేవి యిట్లనియె మరల
వినవయ్య నరనాథ వినిపింతు నొకవార్త
        సోమవారవ్రతస్ఫూర్తిఁ జేసి
యాపతివ్రత తనయాత్మలో భావించి
        భజనం బొనర్చె దంపతులటంచు
ముదితసంకల్ప మమోఘంబు కావున
        నది మాన్ప నలవిగా దజునకైన


తే.

నట్లగుటఁ జేసి వీరల కతిముదమున
నెమ్మిఁ గావింపుఁ డిపుడు పాణిగ్రహంబుఁ
భాస్వరఖ్యాతి యైనసారస్వతునకు
నుద్భవించుఁ గులోద్ధారుఁ డొకసుతుండు.

299


క.

అని యానతిచ్చి త్రిభువన
జనని తిరోధాన మొందె సారస్వతుఁడుం
దనమనమున వెఱఁగందుచు
జనితానందుండు నిర్విచారుం డయ్యెన్.

300


ఆ.

గాఢభక్తి నంబికాదేవి మెప్పించి
వాంఛితంబు దీర వరము వడసి
భూసురోత్తములను పూర్ణ కాములఁజేసి
చనియె నృపతి తనదు సదనమునకు.

301


క.

పరివారవిరహితుండై
హరుపత్ని వరంబునకుఁ గృతార్థుం డగుత