పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/197

ఈ పుట ఆమోదించబడ్డది

190

బ్రహ్మోత్తరఖండము


జయజయ విద్రుమబింబఫలాదరి చక్రసహోదరి పీనకుచే
జయజయ శాంకరి సాధువశంకరి శత్రుభయంకరి మౌనినుతే
జయజయ శుంభనిశుంభనిషూదని సత్యవినోదిని శాంతిరతే.

287


తే.

అనుచు వినుతులు చేయుచు నన్నరేంద్రుఁ
డుపవసించెను దద్విప్రయుతము గాఁగ
మూఁడహోరాత్రములు మౌనముద్రఁ దాల్చి
భక్తి వెలయంగ నంజలీబద్ధుఁ డగుచు.

288


వ.

ఇ ట్లున్నసమయంబున.

289


సీ.

రాకేందుబింబవిభ్రాజితాస్యముతోడ
        ధవళాంబుజాతనేత్రములతోడఁ
గటిభాగశోభితకనకాంబరముతోడ
        డమరుత్రిశూలఖడ్గములతోడ
గళవిరాజన్మణిగ్రైవేయములతోడఁ
        జంద్రావతంసమస్తకముతోడ
సౌదామినీపుంజసన్నిభప్రభతోడ
       మహితలావణ్యవిగ్రహముతోడ


తే.

హారమంజీరకటకకేయూరముఖ్య
భూరిభూషణరాజివిస్ఫూర్తిలొలయ
నిర్భరకృపాప్తితోడ విదర్భపతికి
నంబికాదేవి యపుడు ప్రత్యక్షమయ్యె.

290


తె.

ఇట్లు సాక్షాత్కరించినయిందుమౌళి
గేహినికి వందనముచేసి కేలుదోయి
ఫాలభాగంబున ఘటించి ప్రముదితాత్ముఁ
డగుచు నూరకయుండె నయ్యవనివిభుఁడు.

291