పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/194

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

187


రంజితపటుచర్య లుడిగి రమణీమణియై
మంజుతరభూషణహరి
ద్రాంజనసిందూరకాదు లమర ధరించెన్.

279


క.

సుతహీనులైనవారల
పితరులు పరికింప లుప్తపిండోదకులై
సతతము నిరాశు లగుదురు
క్షితివర మద్గతికి నేమి చెప్పెదొ చెపుమా.

280


తే.

స్నానసంధ్యాదివిధులును జపతపములు
వేదపారాయణంబులు నీటఁ గలిపి
నాతిచందంబుఁ దాల్చిన నాదుసుతున
కెట్లు గతిగల్గు రాజ నీ వెఱుఁగఁ బలుకు.

281


వ.

అని బహుప్రకారంబుల నిష్ఠురభాషణంబు లాడుచున్న
సారస్వతునివాక్యంబు లాకర్ణించి యాభూపాలుం డతివిస్మయ
మానమానసుండయి తనమనంబున నిట్లని వితర్కించె.

282


మ.

పరిహాసార్థముగాఁగ నీద్విజసుతున్ భామాకృతిన్‌ బంపినం
బురుషత్వంబుఁ బరిత్యజించి సతియై పొల్పొంద విచ్చేసెఁ గ్ర
మ్మఱ నౌరా గిరిజామహేశ్వరులసామర్థ్యంబుఁ దద్భక్తభా
సురమాహాత్మ్యము లెంచి చూడ భువిలోఁ జోద్యంబులై కన్పడున్.

283


క.

సీమంతినీప్రభావము
లేమని వర్ణింపఁ బురుషుఁ డెంతయుఁ దలఁపన్
సీమంతినియై నిలిచెను
నామగువతపంబు లెన్న నజునకు వశమే.

284


సీ.

అని వితర్కింపుచు నావిదర్భాధీశుఁ
        డాప్తమంత్రులు దాను నాక్షణమున