పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది

186

బ్రహ్మోత్తరఖండము


వ.

అని పలికి.

272


ఉ.

అంగజుఁ డేయుపుష్పవిశిఖాహతి కోర్వఁగలేక యాత్మ ను
ప్పొంగుచు లజ్జఁ బోవిడిచి మోహభరంబును జెంది యప్పు డ
య్యంగన ప్రాణనాథుమధురాధరము న్మునిపంట నొక్కి యా
లింగన మాచరించెఁ దరళీకృతచిత్తము తత్తరింపఁగన్.

273


వ.

ఇవ్విధమున నతిశయప్రేమాతిరేకంబునం బయిం బడి
యున్న యమ్మానిని నాభుసురసుతుండు సాంత్వవచనమ్ముల
నెట్టకేలకు ననునయించెఁ గ్రమ్మఱ నవ్విప్రమిథునంబు నిజ
గృహములకుం బోవుచు నహో సీమంతినీప్రభావంబు
మహాశ్చర్యకరంబని మనంబునం బొగడుచుఁ జనిరంత.

274


క.

గృహమున కేతెంచిన తన
దుహితను వీక్షించి కినుక దోఁప గురుండు
న్మహిళారూపం బేమని
యహితోక్తుల నడుగఁ జెప్పి రాద్యంతంబుల్.

275


క.

వినినంతమాత్రలో న
జ్జనకులు సక్రోధు లగుచు సరభసముగ నా
జనపతికడ కరుదెంచిరి
తనయాన్వితు లగుచు మదిని దత్తరపడుచున్.

276


వ.

అంత నాభూవరుం జూచి సారస్వతుం డి ట్లనియె.

277


శా.

శుద్ధశ్రోత్రియు మత్కుమారు గతదోషు న్గామినీవేషస
న్నద్ధుం జేసినకారణంబునఁ దగ న్నారీస్వరూపంబు దా
సిద్ధంబయ్యెఁ దదేకపుత్త్రకుఁడనై జీవింప నెట్లోర్తు నీ
యుద్ధారం బిటులయ్యె నీవు కపటోద్యోగుండ వుర్వీశ్వరా.

278


క.

మౌంజీదండకమండలు