పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/189

ఈ పుట ఆమోదించబడ్డది

182

బ్రహ్మోత్తరఖండము


       లిడ్డెన ల్పులగంబు లడ్డువములు
నూరుబిండులు నల్ల నూరుగాయలు నావ
         పచ్చళ్లు పెరుగులు పానకంబు


తే.

లాదిగా గలుగుభక్ష్యభోజ్యము లొసంగి
భూసురేంద్రుల కపుడు దాంబూలములును
దక్షిణ లొసంగి యంతఁ బ్రదక్షిణముగ
వందనము లాచరించె నవ్వనరుహాక్షి.

249


శా.

శిష్టాచారము తప్పకుండఁగఁ దదాశీరక్షతౌఘంబులున్
హృష్టస్వాంతముతోడఁ గైకొని శుభశ్రీకామయై యంతటన్
మృష్టాన్నంబులఁ దుష్టింజెందినధరిత్రీదేవతాశ్రేణికిన్
స్వేష్టార్థంబు లొసంగి పంపె మరలన్ హేమాంగి లీలాగతిన్.

250


క.

తదనంతరమున నాసతి
ముదమున మృష్టాన్నపానములఁ బరితుష్టిం
బొదలుచుఁ బతికి హితంబుగ
సదమలమతి నుండె నపుడు సఖులుం దానున్.

251


వ.

అంత దేశాంతరసమాగతబ్రాహ్మణప్రకరంబు లారాత్రి
యచ్చట వసియించి మరునాఁడు నిజనివాసములకుం జనిరంత
నాకృత్రిమదంపతులు పరజనసందర్శనభీతులై యపరరాత్రం
బున మేల్కాంచి గృహములకు సత్వరప్రయాణమునఁ జను
చుండి రాసమయంబున.

252


శా.

శ్రీరంజిల్లఁగఁ బూర్వరాత్రమున నాసీమంతినీదేవి దా
గౌరీశంకరులంచుఁ జిత్తమున సంకల్పించి పూజించుటం
దారుణ్యాకృతి భూసురుండు పురుషత్వంబు న్విసర్జించి కాం
తారూపంబు ధరించి నిల్చె నపు డత్యాశ్చర్యముం దోఁపఁగన్.

253