పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/180

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

173


వ.

ఇవ్విధమునం బెరుగుచు సమస్తవిద్యాప్రవీణులును వివాహ
సమయోచితతారుణ్యధురీణులును నైన కుమారులం గనుం
గొని తజ్జనకు లి ట్లనిరి.

206


ఉ.

పుత్త్రకులార మీరు పరిపూర్ణవయస్కులు గాన నిప్పు డి
ద్ధాత్రిఁ బరిభ్రమించి వసుధాతలనాథుల నాశ్రయించి సు
క్షేత్రపరిగ్రహార్థముగఁ జేయుఁడు యత్నము మీకు నుత్తమ
శ్రోత్రియు లంచు నిత్తురు వసుప్రకరంబుల నమ్మహీపతుల్.

207


క.

పదపడి పరవాదములకు
నెదురెవ్వరు లేకయుండ నింపు దలిర్పన్
జదివితిరి వేదశాస్త్రము
లిది సమయము యాచకమున కేగుఁడు మీరల్.

208


తే.

శైశవం బాదిగా సర్వసంస్కృతులును
వ్రతము లొనరించితిమి బహుశ్రుతుల మైతి
మిపుడు వృద్ధుల మైతి మే మెంచి చూడ
శక్తులము గాము దేశసంచారమునకు.

209


క.

మీరలు పదియేండ్లకు
మారులు విద్యాప్రసంగమహిమ విదర్భ
క్ష్మారమణు నడిగి యర్థం
బారూఢిగఁ దెచ్చి పెండ్లియాడుఁడు వేగన్.

210


వ.

అని పలికిన నిజజనకులవాక్యములకు సమ్మతించి బ్రహ్మచారు
లైన యయ్యిరువురు విదర్భరాజుసముఖమునకుం జనిన
నమ్మహీనాథుండును బ్రత్యుత్థానపూర్వకంబుగా వారలం
బూజించి యథార్హపీఠంబులం గూర్చుండ నియోగించి
యుండునంత.

211