పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/178

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

171


రంబున నిజకుమారుఁడైనచంద్రాంగదునకుఁ బట్టముఁగట్టి
సకలసామ్రాజ్యభారధురంధరుంగా నియమించి భార్యాసమే
తుండయి వనమునకుం జని యచ్చట వానప్రస్థాశ్రమమున
మహాఘోరతపం బాచరించి దేహము విడిచి భార్యాసమేత
ముగా దివ్యవిమానారూఢుండయి సిద్ధచారణులు సేవింప
శివలోకమున శివసాయుజ్యము నొందిరని చెప్పిన విని పర
మాశ్చర్యము నొంది శౌనకాదిమహామునులు క్రమ్మఱ
సూతున కి ట్లనిరి.

194


క.

మామనములు రంజిల్లఁగ
హైమవతీశ్వరపదార్చనాసాదితమౌ
సీమంతినీప్రభావం
బేమైనను గలిగెనేని యెఱిఁగింపు మొగిన్.

195


క.

కొననుండి చెఱుకు మొదటికిఁ
దినఁదినఁగా మధుర మైనతెఱఁగున నిటలా
క్షునిదివ్యచరిత్రంబులు
వినవినఁగా మాకు మిగుల వేడ్క జనించెన్.

196


వ.

అని యడిగిన నమ్మహామునులకు సూతుం డి ట్లనియె.

197


ఉ.

వింతలు దన్మహత్వములు విప్రియమై వ్రతనిష్ఠ సల్పుచున్
గంతువిరోధిసత్కరుణఁ గ్రమ్మఱ లబ్ధనిజేశ యయ్యె నా
నెంతపతివ్రతాతిలక మెంతటినిశ్చలచిత్త యౌర సీ
మంతినిసత్ప్రభావగరిమంబు గణింపఁ దరంబె యేరికిన్.

198


తే.

అమ్మహాపుణ్యసాధ్వి మహత్త్వ మొక్క
చిత్రకథఁ జెప్పెద వినుండు మైత్రి వెలయ
నదియుఁ గల్యాణదాయకం బది మనోజ్ఞ