పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/176

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

169


జని దనుజాన్వితంబుగ రసాతలలోకముఁ జేరెఁ గ్రమ్మఱన్.

186


వ.

తదనంతరమునఁ జిత్రవర్మమహీపతిచేత ననుజ్ఞాతుం డై నిజ
కళత్రం బగుసీమంతినిఁ దోడ్కొని చంద్రాంగదుం డనేక
సేనాపరివృతుం డై కతిపయదినములకు నిజనగరమునకు వచ్చి
శుభముహూర్తమునఁ దూర్యరవములు భూసురాశీర్వాద
నాదములు చెలంగ శుద్ధాంతప్రదేశము గావించి జననీజనకు
లకు గురుబంధుజనములకుఁ బ్రణామంబు లాచరించి వారల
యాశీర్వాదములు గైకొని పరమానందమున సుఖంబుండి
రంత.

187


సీ.

అంత శుభాచార యైనసీమంతిని
        యత్తమామలకును హర్ష మొదవ
బంధువర్గములకు బ్రాహ్మణోత్తములకు
        నతిభక్తి వందనం బాచరింప
నాపతివ్రత నంద ఱాశీర్వదించిరి
        సతతంబు సౌభాగ్యవతియు గాఁగ
మఱియును దద్వ్రతమాహాత్మ్యమునకును
        లాలిత్యమునకు సుశీలతకును


తే.

వినయగాంభీర్యధైర్యవివేకములకు
సకలజనములు చూచి విస్మయము నొంది
రట్ల శ్వశురులు కోడలి నభినుతించి
యిది సురాంగన యని మది నెంచి రపుడు.

188


ఉ.

మింటను సిద్ధచారణులు మేదినియందు మనుష్యులు న్విని
ష్కంటకపుణ్యశీల సుభగత్వము గల్గినదీని కల్ల ము
క్కంటివధూటి సాటి యగుఁ గాని తదన్యులు గారటంచు జే