పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/175

ఈ పుట ఆమోదించబడ్డది

168

బ్రహ్మోత్తరఖండము


వశ్యమున సుఖనిద్రం జెంది ప్రభాతకాలమున మేల్కాంచి
గౌరీశ్వరధ్యానపరాయణులై మంగళస్నానాదికృత్యంబులు
శివపూజావిధానంబు లాదిగాఁ గల కాల్యకరణీయంబులు
నిర్వర్తించి తదనంతరమున మధురాహారంబుల సంతుష్టిం
జెందియుండి రంత కతిపయదినంబులకుఁ జంద్రాంగదుండు
నిజకళత్రసమేతంబుగాఁ గ్రమ్మఱ నిజరాజధానియగు నిషధ
పురమునకుం బోవ సమకట్టియున్న యన్నరేంద్రనందను నభి
ప్రాయం బెఱింగి.

181


క.

విశదయశుండు తదీయ
శ్వశురుం డగుచిత్రవర్మ జామాతకు ధీ
కుశలునకు నరణ మిచ్చెను
దశసాహస్రశ్వగజరథప్రకరంబుల్.

182


క.

మున్నుగ నాత్మతనూజకు
మన్నించి యమూల్యవస్త్రమణిభూషణముల్
చెన్నలర నిచ్చె నప్పుడు
గన్నుల నానందభాష్పకణములు దొరఁగన్.

183


ఆ.

మఱియు వివిధగంధమాల్యమృగీమద
కుంకుమాంజనార్ద్రసాంకవములు
దగ సహస్రదాసదాసీజనంబులు
గ్రామశతము లొసఁగెఁ గరుణ వెలయ.

184


వ.

ఆసమయంబున.

185


చ.

తనగురునాజ్ఞఁ జేసి నిషధప్రభునందనువెంట వచ్చి త
జ్జనకకళత్రబాంధవుల సన్నిధిఁ జేర్చి యతండు సాదరం
బున మరలింప నాభుజగపుంగవనందనుఁ డాక్షణంబునం