పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/170

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

163


తే.

అత్తలకు మ్రొక్కి వెండియు నార్యులైన
బాంధవులకును హితులకు బ్రాహ్మణులకు
వందనము లాచరించిన వార లతనిఁ
గాంచి జయవాక్యములను దీవించి రంత.

156

సీమంతినీపునర్వివాహఘట్టము

మ.

పునరుద్వాహము సేయఁగాఁ దలఁచి యాభూపాలచంద్రుండు భూ
జనసన్మాన్యులు భూసురోత్తములు రాజశ్రేష్ఠులుం దాను శా
స్త్రనిరూఢక్రియ నిశ్వయించి విలసత్సౌధం బలంకారశో
భన మై యుండ నొనర్చె నప్పుడు సుహృద్బంధుప్రజ ల్మెచ్చఁగన్.

157


క.

భూసురభామినులు మహో
ల్లాసంబున భద్రగీతలలితోక్తులతో
సేసలు చల్లఁగ రత్నమ
యాసనమున రాకుమారుఁ డటు కూర్చుండెన్.

158


సీ.

కమనీయతరశరత్సమయరాకాచంద్ర
        బింబంబుక్రియ ముఖాబ్జంబు వెలయఁ
భ్రాభాతవేళావిరాజత్సరోజాత
        సామ్యంబు లైనలోచనము లలర
వర్షావసరవిభాస్వత్తటిద్వల్లికా
        మానితం బగుచు నెమ్మేను దనరఁ
దిమిరబంధురనిశీధినిదారకలమాడ్కి
        వేణీఖచితపుష్పవితతు లమర


తే.

విశ్వకర్మవినిర్మితవివిధరత్న
చిత్రితసజీవసాలభంజిక యనంగ