పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/168

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

161


ఉ.

నెమ్మిని జిత్రవర్మధరణీపతి శంకరశాంకరీనివా
సమ్ములయందు నుత్సవము సల్పుటకై తగువారిఁ బంచి చి
త్తమ్మునఁ బ్రేమ దోఁపఁగ హితమ్ముగ నల్లునిఁ జూచువాంఛ శీ
ఘ్రమ్మున నేఁగి తోడుకొనిరాఁ బనిచె న్నిజమంత్రివర్గమున్.

146


వ.

ఇట్లు పంపిన వారలు నతిత్వరితంబున నిషధనగరమునకుం జని
చంద్రాంగదసమేతుం డై యున్నయింద్రసేనమహావల్లభుం
గాంచి పరమానందకందళితహృదయారవిందులై యారాజున
కి ట్లనిరి.

147


తే.

ఇంద్రసేనమహీశ దేవేంద్రవిభవ
చిత్రవర్మధరాధిపశేఖరుండు
తనదుజామాతఁ జూడఁ జిత్తమునఁ దలఁచి
నెమ్మి మముఁ బంపె నీదుసాన్నిధ్యమునకు.

148


క.

కైరవహితురాకకును జ
కోరంబులు తరుణిరాకకును గోకంబుల్
గోరుచు నుండువిధంబున
నీరాసుతురాక కలరు నెల్లజనంబున్.

149


క.

కావున నిఁక నాలస్యము
గా వలవదు సత్వరంబు గాఁ బనుపు మనన్
భూవరుఁడు సమ్మతంబుగ
వేవేగమె యాజ్ఞ యొసఁగె వేడ్క చెలంగన్.

150


వ.

ఇట్లు చంద్రాంగదుండు నిజజనకుచేత ననుజ్ఞాతుం డై తల్లి
దండ్రులకుఁ బ్రణామంబులు గావించి భూసురాశీర్వాదం
బులు భేరీభాంకారరవంబులు చెలంగఁ దక్షకాహీంద్రదత్తం
బైనయశ్వరత్నంబు నెక్కి తత్కుమారుండైనయశ్వసేనుండు