పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/167

ఈ పుట ఆమోదించబడ్డది

160

బ్రహ్మోత్తరఖండము


సరసతరాహ్నికము దీర్చి జగతీపతి భూ
సురబంధుమిత్రయుతముగఁ
బరువడిఁ గూర్చుండెఁ దత్సభామధ్యమునన్.

141


శా.

కాళిందీసలిలాంతరాళమున నాగస్థానమున్ జేరి ర
త్నాలంకారచయంబు తక్షకమహానాగేంద్రుచేఁ గొంచు ని
చ్ఛాలీలం జనుదెంచి నేఁడు మరలన్‌ జంద్రాంగదుం డంచు నీ
లీలం బంపెను జిత్రవర్మకడకున్ లేఖార్థసంవాహులన్.

142


సీ.

సప్రాణుఁ డైయున్నచంద్రాంగదునివార్త
        చిత్రంబుగా విని చిత్రవర్మ
సంతతచింతావిచారంబులను మాని
        సకలబాంధవమిత్రసహితముగను
బౌరులు సంతోషపారవశ్యము నొంది
        సొంపు దీపింపఁ జాటింపఁ బనిచె
లేఖార్థవాహకాళికిఁ బ్రీతి మృష్టాన్న
       రాజితాభరణాంబరంబు లొసఁగి


తే.

యపుడు నిజపుత్త్రి రావించి కృప దలిర్పఁ
బూర్వభూషితనవరత్నభూషణములు
మేన శృంగార మొనరించి మేరుధీరుఁ
డతఁడు హర్షాంబునిధి నోలలాడుచుండె.

143


వ.

ఆసమయంబున.

144


మ.

యమునాస్నాన మొనర్పఁబోవునెడ నశ్వారూఢుఁడై వచ్చి నె
య్యముతో మత్కర మంటికొన్నిహితవాక్యంబు ల్ప్రసంగించి చ
న్నమహాత్ముండె మదీయభర్త యని యానందించెఁ జంద్రాంగద
ప్రమదారత్నము శాంకరవ్రతమహత్త్వం బాత్మ భావింపుచున్.

145