పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది

158

బ్రహ్మోత్తరఖండము


రనుకూలవృత్తి మే ల్మే
లని పొగడిరి చలితహృదయు లై విభ్రాంతిన్.

129


శా.

అంతన్ సత్వరితంబుగా నరిగి వా రయ్యింద్రసేనక్షమా
కాంతున్ స్వీయసతీసమేతుఁ గని వేగన్ముక్తునిం జేసి య
త్యంతప్రేమ దదీయపుత్త్రుకథ నాద్యంతంబుగాఁ దెల్పినన్
సంతోషార్ణవమగ్నులైరి మది నాశ్చర్యంబు సంధిల్లఁగన్.

130


క.

ఆక్షణమునఁ బురజనులు సు
రక్షితుఁ డై వచ్చినట్టిరాజతనూజు
న్వీక్షించి సంతసిల్లిరి
నిక్షేపము గన్నభంగి నిర్మలమతు లై.

131


తే.

మదనసన్నిభుఁ డైనకుమారుఁ డపుడు
లీలఁ జనుదెంచె ననువార్త లాలకించి
రాజపత్నియు రాజు హర్షాతిరేక
పరవశతచేఁ బ్రపంచంబు మఱచి రంత.

132


ఉ.

అప్పుడు మంత్రు లాప్తజను లార్యపురోహితభృత్యసంఘముల్
దప్పకవచ్చి రాసుతునిదర్శన మేర్పడఁజేసి కౌతుకం
బుప్పతిలంగఁ దోడ్కొని శుభోజ్జ్వలతూర్యరవంబు మ్రోయ మే
లొప్పఁగ వచ్చి రందఱు మహోన్నతరాజగృహంబుఁ జేరఁగన్.

133


ఉ.

పల్లవపాణు లాడుచును బాడుచు లాజలు నక్షతంబులున్
జల్లుచు రాఁగఁ బౌరజనసంఘము చుట్టును గొల్వ ధారుణీ
వల్లభనందనుండు విభవం బలరం జనుదెంచి తండ్రికిం
దల్లికి సాగిమ్రొక్కఁ గనుదమ్ముల బాష్పజలంబు లొల్కఁగన్.

134


వ.

అంత.

135