పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/164

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

157


తనసహాయులం గూడి తక్షణంబున నిజపురోపకంఠవనము
నకు వచ్చి యచ్చట నిలిచి తక్షకపుత్త్రుఁ డయిన యశ్వ
సేనునిం బిలిచి నీవు మదీయజ్ఞాతులకడకుం జని వారలకు
మదాగమనం బెఱింగింపవలయుఁ బోయిరమ్మని పనిచిన
నతండును వల్లెయని యతిత్వరితమ్మునఁ జనుదెంచి తత్సభా
సీనులై యున్నవారలం గని యిట్లనియె.

126


సీ.

యమునాజలనిమగ్నుఁ డైనచంద్రాంగదుం
       డహిలోకముననుండి యరుగుదెంచి
పురసమీపమున భాసురశౌర్యధర్యుఁ డై
       యుపవనంబున నిల్చి యున్న వాఁడు
భానుతేజుని నింద్రసేనమహారాజు
       బంధముక్తునిఁ జేసి పనుపవలయు
శీఘ్రంబుగా రాజసింహాసనము మీరు
       విడువుడు చక్కఁగా విడువరేని


తే.

యానృపాలతనూభవుఁ డరుగుదెంచి
తక్షకాహీంద్రదత్తదుర్దమకృపాణ
ధార భవదీయశిరములు ధరణిఁ గూల్చి
లీల నిజరాజ్యపదము పాలింపఁగలఁడు.

127


ఉ.

అంగజసుందరాంగుఁడు మహాహితసైన్యవిభంగుఁ డైనచం
ద్రాంగదరాజనందనుఁడు తక్షకుచే బహుమాన మంది సా
రంగధరావతంసుకృపఁ గ్రమ్మరవచ్చె ధరిత్రి కాత్మ ను
ప్పొంగుచు నే నహీంద్రవరపుత్త్రుఁడ మిత్రతదత్సహాయుఁడన్.

128


క.

అని చెప్పిన దాయాదులు
విని యంత భయంబుఁ జెంది విస్మయమున వా