పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/162

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

155


ర్తం బుండి తదనంతరంబున నమృతోపమానంబు లగుభాష
ణంబుల నయ్యింతి నూరడిల్లం బలికి తత్పాణిగ్రహణంబు
గావించి యిట్లనియె. మేము కామగమనంబునఁ బ్రకా
శించుసిద్ధులము నీభర్త సురక్షితుండై యున్నవాఁడు
నొక్కయెడ మే మిరువురము నైక్యంబుగా నుండుదుము
అతండును రెండుమూఁడుదినంబులకు నిందు రాఁగలండు
నీవును నతండును గలసి సకలసామ్రాజ్యసుఖము లనుభ
వించెదరు శ్రీసదాశివుపాదంబు లాన నామాట నిజమ్ముగా
నమ్మి శోకంబు మాని యుండు మని పలికిన నతనిమధుర
వచనములకు నూరడిల్లి విస్మయంబు దీపింప సంభ్రమో
ద్భ్రాంతనయనంబుల నారాజనందనుం దప్పక చూచుచుఁ
దన మనంబున నిట్లని వితర్కించె.

120


మ.

ఇతనిం జూడ మదీయభర్త యగుఁ గాదేనిన్‌ మహాప్రేమసం
గత మై యుండునె నామనం బదియునుంగాక న్నిజాకారశీ
లత నేతెంతురె యన్యలోకగతు లేలా తోఁచె నాబుద్ధి కా
యతసౌందర్యుఁ డితండు ధూర్తజనుఁడో యక్షుండొ గంధర్వుఁడో.

121


మ.

శమనాగారముఁ జేరియున్న పతి సాక్షాత్కారుఁ డయ్యె న్మతి
భ్రమమో మోహమొ స్వప్నమో యిది యథార్థంబో విచారింప ని
క్కముగా నే నొనరించునట్టివిలసద్గౌరీశపూజావిధా
నము సార్థంబొ నిరర్థకంబొ తలఁపన్ నాభాగ్య మెట్లున్నదో.

122


సీ.

మునిపత్ని వాత్సల్యమున నుపదేశించె
         రంజిల్ల సోమవారవ్రతంబు
నెటువంటియాపద లేతెంచి యున్నను