పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/161

ఈ పుట ఆమోదించబడ్డది

154

బ్రహ్మోత్తరఖండము


తే.

సోమవారంబునందు నీసుదతి యిపుడు
సమ్మతంబుగఁ బార్వతీశ్వరులపూజ
సేయుఁ గావున నిపు డభిషేచనార్థ
మరుగుదెంచె దృఢవ్రత యగుటఁ జేసి

115


వ.

అని చెప్పి సూతుం డి ట్లనియె నట్లు సఖీముఖంబునఁ దన
వృత్తాంతంబు సర్వంబు దెలియంజెప్పి క్రమ్మఱ నారాజ
కుమారునిఁ జూచి సీమంతిని వారి కి ట్లనియె.

116


క.

శ్రీరంజిల నవమదనా
కారుండవు కిన్నరుఁడవో గంధర్వుఁడవో
చారణుఁడవొ మనుజుఁడవో
వారెవ్వరు నీదుపార్శ్వవర్తులు దలఁపన్.

117


క.

ఇత్తెఱఁగునఁ బలుమఱు నా
వృత్తాంతము నడిగె దీవు విశదంబుగ లో
కోత్తర సస్నేహముగా
నిత్తఱి ననుఁ జూచినవొ యెన్నండైనన్.

118


క.

ఈవార్తఁ దెలియఁ బలుకం
గావలయు సవిస్తరముగఁ గారుణ్యముతో
నేవేళనైన బుధులు మృ
షావాక్యము లాడఁ జనరు సకలవిధములన్.

119


వ.

అని యివ్విధంబున నారాజపుత్త్రిక యన్నరేంద్రనంద
నుతో సల్లాపంబు లొనరింపుచు బాష్పపూరితలోచనయు
గద్గదకంఠయు మోహమూర్ఛాపరవశయు నై ధరణీతలము
పయిం బడియున్ననిజకళత్రంబు నీక్షించి చంద్రాంగ
దుండును శోకాకులితమానసుం డై మౌనంబున ముహూ