పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/150

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

143


మ.

బలుశోకంబునఁ జిత్రవర్మధరణీపాలుండు వర్తించి ని
శ్చలవైజ్ఞానికు లైనవృద్ధజను లాశ్వాసించి తత్త్వోక్తులం
దెలియం జెప్పఁగ నెట్టకేలకు మహాధీరాత్ముఁ డై లేచి ని
ర్మలభావంబున నాత్మమందిరముఁ జేరన్ వచ్చెఁ దాఁ గ్రమ్మఱన్.

63


తే.

భూతలాధీశ్వరుండు జామాత కప్పు
డౌర్ధ్వదైహికకృత్యంబు లాచరింప
భూసురులఁ బంచి యాత్మీయపుత్రికకును
దత్సమయకార్యము లొనర్చెఁ దథ్యమనుచు.

64


ఉ.

అంతటఁ దండ్రిగేహమున నమ్మునిపత్ని యనుజ్ఞఁ జేసి సీ
మంతిని రాహుదష్టశశిమండలసంయుతపూర్ణిమానిశా
కాంతవిధంబునం దనరి క్రమ్మఱ నావ్రత మాచరింపుచున్
గంతువిరోధిభక్తి మదిఁ గల్గి మెలంగెను ధీరచిత్త యై.

65


క.

ఈరీతి నావధూమణి
గౌరీశంకరులపూజ గావింపుచు వి
ప్రారాధన మొనరింపఁగ
నారయ నటు వత్సరత్రయముఁ గడపె భువిన్.

66


వ.

అని చెప్పి సూతుండు వెండియు నమ్మహామునుల కి ట్లనియె.

67


శా.

కాళిందీసలిలాంతరాళవినిమగ్నస్వాంగుఁ డై విస్ఫుర
చ్ఛైలేంద్రాత్మభవేశభక్తిపరుఁడౌ చంద్రాంగదాఖ్యక్షమా
పాలుం డత్తఱి నాహ్రదంబున జలవ్యాసక్తలన్ యౌవన
శ్రీలాలిత్యల నాగకన్యకలఁ గాంచెం దైవయోగంబునన్.

68


ఉ.

మానితమందహాసు నవమన్మథరూపవిలాసు శ్రీశివ
ధ్యానపరున్‌ శుభోజ్జ్వలగుణాకరు రాజకుమారుఁ గాంచి కుం
భీనసరాజకన్యకలు విస్మయమానమనస్కులై ఫణి
స్థానమనోహరం బగురసాతలలోకముఁ జేర్చి రంతటన్.

69