పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/144

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

137


రములు బ్రదోషకాలముల రమ్యత మీఱఁగ షోడశోపచా
రములను బార్వతీశ్వరుల రంజిలఁ బూజ లొనర్పఁగాఁ దగున్.

41


క.

పూజానంతరమున ద్విజ
భోజన మొనరించి మఱియు భూసురసతులం
బూజించి హరిద్రాంజన
రాజితసుమకంచుకాంబరము లీయఁదగున్.

42


క.

ఎటువంటియాపదలు సం
కటములు బ్రాపించినను జగన్నుత మగుధూ
ర్జటిపూజ విడువఁగూడదు
పటుమతి గావించినను శుభం బగు నీకున్.

43


వ.

అని చెప్పి యమ్మహామునిపత్ని సీమంతినింజూచి యే నిమ్మహా
వ్రతఫలంబు వివరించెద సావధానంబుగా నాకర్ణింపుమని
యిట్లనియె అభిషేకంబునఁ బాపక్షయంబును బీఠపూజనంబున
సామ్రాజ్యంబును గంధమాల్యాక్షతార్పణంబులవలన ననేక
సౌభాగ్యసౌఖ్యంబులును ధూపదానంబున సౌగంధ్యంబును
దీపప్రదానంబునఁ గాంతివిశేషమును నైవేద్యమున మహా
భాగ్యమును దాంబూలదానమున సంపత్సమృద్ధియు నమస్కా
రంబున ధర్మార్థకామమోక్షప్రాప్తియు మంత్రజపంబున నణి
మాద్యష్టైశ్వర్య సిద్ధులును హోమంబున సర్వకోశాభి
వృద్దియు బ్రాహ్మణ భోజనంబువలన సమస్తదేవతాసంతు
ష్టియు సువాసినీపూజనంబున దీర్ఘసుమంగలిత్వమునుం గలుగు
నట్లు గావున నీ విమ్మహావ్రతంబు గావించి భవానీశంకరుల
నారాధింపుము తత్ప్రసాదంబున నాపత్సముద్రంబు నిస్తరించి
విప్రియత్వంబునుం జెందక సుఖమున నుండుదువు శివపూజా