పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

7


భూతోచ్చాటనదక్షుఁడు
జ్యోతికులాంభోధిపూర్ణసోముఁడు వెలయున్.

23


క.

ఘనుఁ డామంత్రిశిఖామణి
యనుపమయశుఁ డొప్పె నాశ్వలాయనసూత్రుం
డన నాచార్యధురంధరుఁ
డన బడగల్నాటికన్నడాన్వయుఁ డనఁగన్.

24


క.

ఈతలిశానప్పకు విమ
లాతతసత్కీర్తిశాలి హరిచరణాంభో
జాతధ్యానపరుం డగు
సీతారామప్రభుండు చెలువుఁడు పుట్టెన్.

25


శా.

చేతోజాతజయంతసుందరుఁడు కాశీసేతుపర్యంతవి
ఖ్యాతప్రాభవశక్తియుక్తుఁడు లసద్గాంభీర్యవారాశిని
ర్ధూతాఘుండును విష్ణువర్ధనసగోత్రుం డాశ్రితత్రాణుఁడై
సీతారామఘనుండు పొల్చు జగతిన్ శ్రీమంతుఁడో నాజనుల్.

26


తే.

అతఁడు నిజపత్నియైన లక్ష్మాంబయందు
సొరిది గోవిందరాముని సుబ్బనార్యుఁ
గాంచె రఘుపతి జానకీకాంతయందు
మున్ను కుశలవధీరులఁ గన్నపగిది.

27


వ.

అం దగ్రజుండు.

28


మ.

నరసంఘంబు నుతింపఁగాఁ బ్రబలె శ్రీనారాయణబ్రహ్మస
ద్గురుకారుణ్యకటాక్షలబ్ధవిలసద్యోగానుసంధానని
ర్భరజాగ్రత్సహజామనస్కపరమబ్రహ్మైక్యబోధామృతాం
కురితాదృశ్యచరాచరాత్మకుఁడునై గోవిందరాముం డిలన్.

29