పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/139

ఈ పుట ఆమోదించబడ్డది

132

బ్రహ్మోత్తరఖండము


న్నిరతం బరినిగ్రహమును
సరసానుగ్రహముఁ గలిగి జనపతి వెలయున్.

16


తే.

ధర్మరతుఁ డైనయాచిత్రవర్మనృపతి
కాత్మ ముదమందఁ గలిగెఁ బుత్రాష్టకంబు
నంతఁ జిరకాలమునకుఁ గల్యాణధన్య
సకలజనమాన్య యొక్కకన్యక జనించె.

17


ఆ.

చిత్రవర్మ తనదుపుత్త్రిక నీక్షించి
యార్యఁ గనిన యాహిమాద్రికరణి
సంతసిల్లి యపుడు సంపూర్ణకాముండ
నైతి నే నటంచు నాత్మఁ దలఁచె.

18


వ.

అంత.

19


మ.

అలఘుప్రాభవుఁ డానృపాలకుఁడు కన్యారత్నముం గాంచి యు
జ్జ్వలతేజోవిభవంబు మీఱ నమితోత్సాహైకచిత్తంబు రం
జిలఁగా జాతకలక్షణజ్ఞుల మహాసిద్ధాంతులన్ వేదవే
త్తల రావించి బహూకరించి యడిగెన్ దల్లగ్నభావంబులన్.

20


శా.

ఓవిప్రోత్తములార మీరలు మదీయోక్తి న్విచారింపుఁడీ
మావంశంబున రాజకన్యకలు సామ్రాజ్యాభియోగార్హలై
శ్రీ వర్ధిల్లఁగ నుందు రీశిశువు వారిం బోలి యశ్రాంతమున్
దేవబ్రాహ్మణపూజనాభిరత యై దీపించునో చెప్పరే.

21


క.

నావిని యాసైద్ధాంతికు
లావసుధేశ్వరుని జూచి హర్షముతో సం
భావించి పలికి రప్పుడు
ప్రావీణ్యముతోడ శాస్త్రఫణితులు మెఱయన్.

22