వ. |
అని పల్కి యాగంధర్వరాజకన్యక సఖీజనసమీపంబునకు
మరలం జనియె నంత నారాజకుమారుండును భూసుర
నందనుం డున్నయెడకు వచ్చి గృహంబునకుం జని తమతల్లికి
మనఃప్రియంబు గావింపుచు నారేయి గడపి మరునాఁడు
ప్రభాతకాలంబున ద్విజపుత్రకసహితంబుగా వనంబుఁ
బ్రవేశించి పూర్వనిర్దిష్టం బైనప్రదేశంబునకుం జని.
| 368
|
క. |
కనుఁగొనె నాబాలకయుగ
మనుపమతేజోభిరాము డఁగుచిత్రరథుం
దనయాయుతుఁడై యతఁడును
గనె నంతఁ గుమారకుల వికాసితముఖులన్.
| 369
|
చిత్రరథుం డను గంధర్వరాజు ధర్మగుప్తునకుఁ దనకూఁతు నిచ్చి వివాహం బొనర్చుట.
ఆ. |
కాంచి మోద మలర గంధర్వనాథుండు
సాదరముగ వారి సన్నుతించి
లలితవృక్షమూలతలమునఁ గూర్చుండి
నృపకుమారుతోడ నిట్టు లనియె.
| 370
|
సీ. |
భూపాలసుత విను పూర్వదినంబున
జనియుంటి కైలాసశైలమునకు
నాస్థలంబున గంటి నార్యాసమేతుఁడై
వెలయుమహాదేవు విశ్వనాథు
నంత నద్దేవేశుఁ డఖిలసుపర్వులు
వినఁగ నాతో నిట్టు లనుచుఁ బలికె
ధర్మగుప్తుం డనుధరణీశనందనుఁ
డొకఁడు వర్తించు నీయుర్వియందు
|
|