పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/126

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

119


ధనము విభాగించికొనుఁడు ధర్మస్థితిగన్.

350


వ.

అని పలికిన రాజకుమారుం డి ట్లనియె.

351


తే.

తల్లి! నీతనయుండె యీధనముఁ గొనుట
కర్హుఁ డగుఁగాని యేను గా నట్టులగుట
నీశ్వరుం డింక నేమైన నిచ్చెనేని
దాని నే భక్తిఁ గొందుఁ దథ్యంబుగాఁగ.

352


క.

అని పలికి ధర్మగుప్తుఁడు
మునుపటిచందమున నభవుఁ బూజించుచుఁ బా
వనమతి నుండఁగ గాలము
చనియెన్ సంవత్సరంబు సంపూర్ణముగన్.

353


తే.

ఇట్లు వైదర్భనందనుం డింపుమీఱ
ద్వాదశాబ్దవయస్కుఁడై మోద మలర
విమలభక్తి గురూపదేశమునఁ జేసి
సంతతంబును శివపూజ సలుపుచుండె.

354


ఉ.

అంత నతిప్రకాశితదిగంతము వర్ధితశాతకామరా
ట్కుంతము తోషితాఖిలశకుంతము కైటభజిత్కుమారసా
మంతము భృంగమార్గణశమంతము సర్వవసుంధరాస్థలా
క్రాంతము పాంథజీవనదురంతము దోఁచె వసంత మయ్యెడన్.

355

వసంతఋతువర్ణనము

క.

కలకంఠశుకపికావళి
కలకలరవముల నెసంగెఁ గాననభూముల్
జలజేందీవరహల్లక
కలితములై యొప్పుచుండెఁ గాసారంబుల్.

356