పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/125

ఈ పుట ఆమోదించబడ్డది

118

బ్రహ్మోత్తరఖండము


మహేశ్వరారాధనపరం బయిన మంత్రవిద్య నుపదేశించిన
వారును ప్రహృష్టాంతరంగులై యమ్మహర్షిసత్తమునకుఁ
బ్రణమిల్లి తదనుజ్ఞాతులై యమ్మువ్వురు నిజమందిరమునకుఁ
గ్రమ్మఱఁ జనుదెంచిరి శాండిల్యమహామునీంద్రుండును నిజ
తపోవనమునకుం జనియె నంత.

347


క.

మునివరునుపదేశక్రమ
మున నయ్యిరువురుఁ బ్రదోషపూజాపరు లై
యనుదినమును వర్తింపఁగఁ
జనియె న్మాసములు నాల్గు సమ్మదలీలన్.

348


సీ.

అంతట నొక్కనాఁ డాబాలు రిరువురు
        మాధ్యాహ్నికస్నాన మాచరింప
బోయి నదీతటంబున విహారము సల్పు
       చుండ నం దొకచోట నుత్కటముగ
నిర్ఘాతపాతవినిర్గతం బగుధన
       నిక్షేపమొక్కటి నేత్రములకు
నగుపడఁ జూచి యత్యాశ్చర్యమును బొంది
      మనము రంజిల దానిఁ గొనుచు వచ్చి


తే.

అంబ! వీక్షింపవమ్మ శ్రీసాంబశివుని
మానితానుగ్రహం బీనిధానకుంభ
రూపమునఁ గానఁబడియె నిర్దుష్టముగను
సత్వరంబుగ మనయదృష్టము ఫలించె.

349


క.

అని చెప్పిన బాలకులం
గనుఁగొని యాయమయు హర్షకలితాత్మకయై
తనయుల కిట్లనె మీ రీ